NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

త‌ప్పు చేశారు… జ‌గ‌న్ ఎమ్మెల్యేలు జైలుకే ?!

YSRCP: Reddy Leaders Indirect Warnings to Party!?

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని ప‌లువురు ఎమ్మెల్యేల‌పై రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. వివిధ అంశాల్లో స‌ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు విప‌క్షాల‌కు టార్గెట్ అవుతుంటారు.

how ysrcp status will be like upto 2023

అయితే, తాజాగా మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ అడుగు ముందుకు వేసి మ‌రిన్ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీలో భారీ అవినీతి జరిగిందని పేర్కొన్న ఈ అంశంపై `ట్విట్టర్‌` వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.

లోకేష్ ఏమంటున్నారు?

ఇళ్ల స్థలాలకు భూ సేకరణలో ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పేదలకు అది సెంటు స్థలం, వైఎస్ జగన్‌కికి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు అది కుంభస్థలం అంటూ విరుచుకుప‌డ్డారు. స్థల సేకరణలో అవినీతి, చదును పేరుతో దోపిడీ, పంపిణీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని మండిపడ్డారు. పేదల పేరుతో జగన్ రెడ్డి త్రీ ఇన్ వన్ స్కాం విలువ 6,500 కోట్లని ఆరోపించారు. టీడీపీ హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లకు బులుగు రంగు వేసినంత మాత్రాన సైకిల్ బ్రాండ్ చెరిగిపోదు అని అన్నారు. ఇప్పటి వరకూ టీడీపీ కేసుల వలనే స్థలం ఇవ్వలేకపోతున్నాం అన్నారు మరి ఇప్పుడెలా ఇస్తున్నారంటూ లోకేష్ ప్ర‌శ్నించారు. జగన్ కోటలోని మరుగుదొడ్డి కంటే తక్కువుగా కొండలు, గుట్టలు, శ్మశానాల్లో, చెరువుల్లో ఇచ్చే స్థలంలో పేదలు ఉండే పరిస్థితి లేదని లోకేష్ అన్నారు. ఇప్పుడున్న ఆధారాలతో జగనన్న జైలు పిలుస్తోంది పథకంలో భాగంగా 41 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు జైలులో జగన్ రెడ్డితో పాటు చిప్పకూడు తినడం ఖాయమంటూ లోకేష్‌ ట్వీట్‌ చేశారు

మ‌రుగుదొడ్డి కంటే త‌క్కువ‌..

మ‌రోవైపు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పేదలకు ఇచ్చే ఇంటి స్థలం జగన్ ఇంట్లో బాత్‌రూం అంత కూడా లేదని ఆయ‌న ఎద్దేవా చేశారు. నివాసం ఉంటున్న సొంత స్థలానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి పట్టా అంటారా అని ప్రశ్నించారు. పది లక్షల విలువైన స్థలాన్ని 50 లక్షలకు కొని, ప్రజలకు మాత్రం సెంటు భూమి మాత్రమే ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల కొనుగోలులో 6500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. దమ్ముంటే ఇళ్ల పట్టాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జేట్యాక్స్ కోసమే కొత్త పథకాలు ప్రారంభిస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు . సెంటు భూమిలో కట్టే ఇంట్లో తనలాంటి ఎత్తు ఉన్న వాళ్లు పడుకోవడం సాధ్యం కాదని చెప్పారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju