గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన ‘క్రాక్’ చిత్రం ఎన్నో అడ్డంకులను తొలగించుకుని విడుదలకు సిద్ధమైంది. ఈరోజు ఉదయం స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, మార్నింగ్, మ్యాట్నీ షో లుకొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే.
అయితే ప్రొడ్యూసర్ మధు తమిళ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వారితో తనకున్న ఇబ్బందులు అన్నింటిని క్లియర్ చేసిన కారణంగా ఈ సినిమా విడుదలకు అనుమతి లభించింది. ఇక రాష్ట్రంలో సాయంత్రం కాలపు షోలు అన్ని యథాతదంగా నడవనున్నాయి. క్యాన్సిల్ అయిన షోలకు రీఫండ్ సౌకర్యం ఉంటుంది. అయితే చాలామంది ప్రేక్షకులకు ఇంకా రీఫండ్ అందలేదు అన్న కంప్లైంట్ ఉంది.
మొత్తానికి క్రాక్ సినిమా థియేటర్లలో మొదలు కావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఖుషి అయ్యారనే చెప్పాలి. ముందు 13వ తేదీకి రిలీజ్ వాయిదా వేస్తారని వార్తలు వచ్చాయి దీంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో మరొక మూడు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు రిలీజ్ చేస్తే వీకెండ్ కలెక్షన్లు కొల్లగొట్టే సౌకర్యం కూడా పోతుంది. వరుసగా నాలుగు రోజులు ఏకచ్ఛత్రాధిపత్యంగా థియేటర్లలో రవితేజ అ చేసే ఛాన్స్ కూడా మిస్ అవుతారు.
పూర్తి కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ రిపోర్టులు అందుకోవడం గమనార్హం. దీంతో డిస్ట్రిబ్యూటర్ కూడా తాజాగా లభించిన అనుమతుల వల్ల లాభపడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.