NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

revanth reddy : ద‌టీజ్ రేవంత్ రెడ్డి…. ఇటు కేసీఆర్ అటు కాంగ్రెస్ నేత‌ల‌కు అదిరిపోయే షాక్‌

Revanth reddy : రేవంత్ రెడ్డి… కాంగ్రెస్‌ ఎంపీ, తెలంగాణ లో ఉన్న ఫైర్ బ్రాండ్ నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు. రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నాయకుడు. త‌న స‌హ‌జ‌సిద్ద దూకుడుకు కొన‌సాగింపుగా రాజీవ్ రైతు భరోసా దీక్షను పాదయాత్రగా మార్పు చేశారు.

revanth-reddy-double-shock-at-same-time
revanth-reddy-double-shock-at-same-time

అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు రేవంత్ పాదయాత్ర కొనసాగుతోంది. రేవంత్ యాత్రకు హైకమాండ్ అనుమతి లేదంటూ సీనియర్ల పెదవి విరుస్తున్నా..అధిష్టానం సూచనతోనే పాదయాత్ర చేస్తున్నానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పాదయాత్రలతో రైతుల వద్దకు వెళ్లాలని అదిష్టానం పంపిన నోట్ బయటపడడంతో నేతలు చల్లబడ్డారు. అదే స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు మ‌ళ్లీ బీపీ పెంచే ప్ర‌య‌త్నం చేశారు.

Revanth reddy  రేవంత్ స్టైలే వేరు…

వివిధ అంశాలపై అధికార పార్టీని, సీఎంను, మంత్రులను ఇలా అందరినీపై డైరెక్ట్‌గా ఫైర్ బ్రాండ్ రేవంత్ ఎటాక్ చేస్తుంటారు. ఏ విషయంలోనైనా నిలదీయడంలో ముందుంటారు. ఇక, తెలంగాణ పీసీసీ చీఫ్ రేస్‌లో రేవంత్ రెడ్డి ఉన్నాడన్న చర్చ సాగుతోన్న సమయంలో.. ఆయ‌న పాదయాత్ర మొద‌లుపెట్టారు. అయితే, రేవంత్ పాదయాత్రవైపు ఉత్తం, భట్టి, కోమటిరెడ్డి బ్రదర్స్, విహెచ్, జగ్గారెడ్డి లాంటి నేతలు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. మ‌రోవైపు…రేవంత్ పాదయాత్ర ఫెయిల్యూర్ అంటూ హైకమాండ్‌కు కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే రేవంత్‌ పాదయాత్రలో జనాదరణకు..పార్టీ నేతల ఫిర్యాదులకు పొంతన లేకపోవడంతో ఢిల్లీ నేతలు అవాక్కయ్యార‌ట‌.

ఢిల్లీ పీఠం తో షాక్ ఇచ్చిన రేవంత్

రేవంత్ యాత్రకు హైకమాండ్ అనుమతి లేదంటూ సీనియర్ల పెదవి విరుపులు వినిపిస్తున్న స‌మ‌యంలో అదిష్టానం పంపిన నోట్ బయటపడింది. దీంతో నేత‌లు సైలెంట్ అయ్యార‌ట‌. పాదయాత్ర ముగింపులో ఈనెల 16న రావిర్యాలలో రేవంత్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రేవంత్ సభకు పార్టీలో ముఖ్య నేతలు ఎవరెవరు హాజరవుతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కేసీఆర్ కు సైతం….

మ‌రోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన పెన్షన్ల హామీ ఇంకా అమలు కాలేదని ఈ లేఖ లో రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. 60 నుంచి 57 ఏళ్లకు తగ్గింపు హామీ రెండేళ్లయినా అతిగతీ లేదని మండిపడ్డారు. 2018 తర్వాత భర్తలను కోల్పోయిన ఒంటరి మహిలలను గుర్తించి తక్షణమే పింఛన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. గత రెండేళ్లుగా లక్షలాది మంది అర్హులు పెన్షన్లకు దూరమయ్యారని.. పెన్షన్లకు అర్హులైన వారిని గుర్తించేందుకు ఎన్యూమరేషన్‌ చేయించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?