Ghost haunted: ఓ మహిళ ఆ రైల్వే పట్టాల మీద ఆత్మ హత్య చేసుకోవడం వలన ఆ మహిళ ఆత్మ అక్కడే సంచరిస్తుందని తనను చుసిన ఉద్యోగులను, స్టేషన్ మాస్టర్ లను చంపేస్తుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇవి ఇలా ఉండగా మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అలంటి ఏమి లేవని ఈ వాదనలను కొట్టిపారేసింది. ఈ కథనాల వలన గత 42 ఏళ్లుగా ఈ రైల్వే స్టేషన్ ను మూసివేశారు.
ఈ 42 సంవత్సరాలలో ఈ స్టేషన్ లో ఏ రైలు ఎపుడూ ఆగలేదు. కానీ 2009 వ సంవత్సరంలో మమతా బెనర్జీ హయాములో ఈ రైల్వే స్టేషన్ ను మళ్ళి తిరిగి ప్రారంభించారు. కానీ ఇప్పటికి ప్రజలలో భయం అలానే ఉండిపోయింది. ఇప్పటికి ఆ రైల్వే స్టేషన్ లో రాత్రివేళలో ప్రయాణికులు కనిపించడం లేదు. ప్రభుత్వం వారికి ఎంత సర్దిచెప్పినా ప్రజలు వినిపించుకోవడం లేదు.
ఇక చివరిగా మూడవది మహారాష్ట్ర లోని డోంబివ్లీ రైల్వే స్టేషన్…. ఘోస్ట్ హూంటెడ్ రైల్వే స్టేషన్ లలో మహారాష్ట్ర లోని డోంబివ్లీ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం అక్కడ రోజూ అర్ధ రాత్రి సమయంలో ఓ మహిళ రైలు కోసం ఎదురుచూస్తూ కనిపిస్తుందట. ఒక రోజు అలా ఆ మహిళ ఎదురుచూస్తూ ఉండడాన్ని గమనించిన ఓ వ్యక్తి ఆమెను ఈ సమయంలో ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించగా ఆమె రైలు కోసం ఎదురుచూస్తున్నా అని సమాధానం ఇస్తుంది. అతడి రైలు రావడంతో అక్కడ నుంచి అతడు వెళ్ళిపోతాడు.
ఆ మరుసటి రోజు కూడా ఆమె అక్కడే ఉండడం చూసి అదే రైలులో ఉన్న అతడి స్నేహితుడికి ఆమె గురించి చెబుతూ చూపించగా అతని స్నేహితుడు తనకి అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదని చెప్పగా షాక్ అయ్యాడు. వెంటనే తాను చూసింది ఒక ఆత్మని అని అతనికి అర్ధం అయ్యింది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.