NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Covid : కరోనా తీవ్ర రూపం..! వచ్చే 15 రోజులు మరింత జాగ్రత్త..!!

Corona Killed: Families Died in Vijayawada Corona

Covid : కోవిడ్ Covid దేశంలో తగ్గిందనుకున్న కరోనా తీవ్రత మళ్లీ ప్రళయంలా విరుచుకుపడుతోంది. దేశ ఆర్ధిక వ్యవస్థ, ప్రజా జీవనం, వ్యవస్థలన్నీ గాడిన పడుతున్న తరుణంలో మళ్లీ మునుపటి ఏడాది పరిస్థితులు తీసుకొస్తున్నాయి. దేశంలో ప్రధానంగా పది రాష్ట్రాల్లోనే కరోనా పెను ప్రభావం చూపిస్తున్నా.. ఇది దేశం మొత్తానికి హెచ్చరిక అని చెప్పాలి. ఏకంగా గడచిన 24 గంటల్లో 89,129కేసులు నమోదవడం.. 714 మంది ప్రాణాలు కోల్పోవడమే పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. దేశంలో కరోనా గాలులు వీయడం మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరకూ మొత్తంగా 164,110మంది చనిపోగా.. 1,23,92,260 మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి కాస్తంత తీవ్రంగానే ఉంది. ఇదంతా కేవలం మనిషి చేసుకున్న ‘నిర్లక్ష్యం’.

beware in coming 15 days with corona Covid
beware in coming 15 days with corona Covid

ప్రపంచం మొత్తం మీద ఒక దేశం నుంచి రెండు కరోనా వ్యాక్సిన్లు రావడం కేవలం భారత్ లో మాత్రమే జరిగింది. అగ్రరాజ్యం అమెరికా నుంచి వెస్టిండీస్ వంటి దీవులకు కూడా వ్యాక్సిన్లు పంపించాం. ‘ఇదే కదా మన గొప్పదనం’ అనుకున్నారేమో.. ప్రజలు కరోనాను తక్కువ అంచనా వేశారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటించడం మానేశారు. మహారాష్ట్రలో మొదలైన ఉత్పాతం మళ్లీ దేశం మొత్తం ఇబ్బందిపడేలా చేస్తోంది. గడచిన తెలుగు రాష్ట్రాల్లో గడచిన 24 గంటల్లో ఏపీలో 1398, తెలంగాణలో 1321 కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో ఈ నెల మధ్యనాటికి కరోనా ఉగ్రరూపం చూపి ఆ తరువాత కేసులు తగ్గుతాయని.. మళ్లీ మే 15-20 మధ్య కేసులు గరిష్ట స్థాయికి చేరుతాయని అంటున్నారు.

 

సూత్ర SUTRA (Susceptible, Undetected, Tested (positive), Removed (recovered or dead) అనే గణిత నమూనా తో మహేంద్ర వర్మ సారథ్యంలోని కాన్పూర్ శాస్తవేత్తల బృందం ఈ లెక్కలు వేసింది. మొదటి దశ సమయంలోనూ ఇదే నమూనా శాస్త్రవేత్తలు అనుసరించారు. గతంలో 2020 సెప్టెంబర్ కి గిరిష్టానికి పెరిగి 2021 ఫిబ్రవరికి తగ్గుతాయని వేసిన అంచనాలు సక్సెస్ కావడంతో ప్రస్తుత నివేదికపై ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో ఒడిషా, పంజాబ్ రాష్ట్రాలను హెచ్చరించింది. మహారాష్ట్రలో తీవ్రత కొనసాగుతుందని తెలిపింది. మొత్తంగా మే చివరి వరకూ చాలా అప్రమత్తంగా ఉండాలని పరిస్థితులు చెప్తున్నాయి.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju