Corona : దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా గత మూడు వారాల నుండి కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ..వైద్య మరియు ప్రభుత్వ రంగాలలో టెన్షన్ నెలకొంది. దాదాపు ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయినట్లే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఒకపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న గాని మరోపక్క సామాన్యుల నుండి ప్రముఖ రాజకీయ నేతలు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నాకు కరోనా పాజిటివ్ రావడం జరిగింది. వైద్యుల సూచనల మేరకు హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలి. అందరూ జాగ్రత్తగా ఉండాలి అంటే పోస్ట్ పెట్టారు.