Corona Death: రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. నిత్యం ప్రజలతో సంబంధాలు నెరిపే ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. కొందరు చికిత్స అనంతరం కోలుకుంటుండగా మరి కొందరు మృత్యువాత పడుతున్నారు. తాజాగా విశాఖలో కరోనా బారిన పడి మరో కార్పోరేటర్ మృతి చెందాడు. మార్చి నెలలో వైసీపీకి చెందిన 61వ డివిజన్ కార్పోరేటర్ దాడి సూర్యకుమారి ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే.
నేడు టీడీపీకి చెందిన 31వ డివిజన్ కార్పోరేటర్ వి రవికుమార్ మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో రవికుమార్ అనాధ శవాల అంత్యక్రియలు లాంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రవికుమార్ మృతి పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రవికుమార్ మృతితో 31వ డివిజన్ లో విషాదం నెలకొంది.
ఇటీవల జరిగిన జీవిఎంసీ ఎన్నికల్లో ప్రజాసేవ చేసేందుకు ప్రజలు అవకాశం కల్పిస్తూ గెలిపించినా కరోనా ఆ అవకాశం ఇవ్వకుండా రవికుమార్ ను తీసుకుపోయింది.