Black fungus: దేశవ్యాప్తంగా ఓ వైపు కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో బ్లాక్ ఫంగస్ , వైట్ ఫంగస్ ముప్పు ప్రజలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా సోకిన వారికి బ్లాక్ ఫంగస్ ముప్పు ఉన్నట్లు ఇప్పటివరకు నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. అయితే, తాజాగా ఓ సంచలన విషయంలో వెలుగులోకి వచ్చింది. కొంతమందిలో కరోనా సోకకపోయినప్పటికీ బ్లాక్ ఫంగస్ ముప్పు కలుగుతోందని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. దీంతో ప్రజల్లో మరింత టెన్షన్ మొదలైంది.
Read More : KCR: షాక్ః కేసీఆర్ చేసిన ప్రకటనే లైట్ తీసుకుంటున్న అధికారులు
వీరికే ఆ ముప్పు
కరోనా రాకపోయినా బ్లాక్ ఫంగస్ ముప్పు వచ్చే వారిలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. మధుమోహం అదుపులో లేని వారికి బ్లాక్ ఫంగస్ సోకుతుందని చెప్పారు. రక్తంలో షుగర్ లెవల్స్ 700కు చేరినప్పుడు బ్లాక్ ఫంగస్ వస్తుందని నిపుణులు విశ్లేషించినట్లు పాల్ వివరించారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి నిమోనియా, ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్ల అధ్యయనంలో తెలినట్లు వీకే పాల్ పేర్కొన్నారు.
Read more : జగన్ ను అడ్డంగా బుక్ చేస్తున్న కేసీఆర్ ?
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్….
దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న బ్లాక్ ఫంగస్ విషయంలో తెలంగాణ ఆయుష్ విభాగం కీలక ప్రకటన చేసింది. హోమియో ట్రీట్మెంట్తో బ్లాక్ఫంగస్ వ్యాధిని నివారించవచ్చని రాష్ట్ర ఆయుష్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి తెలిపారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారు బ్లాక్ ఫంగస్ బారిన పడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని, ఇలాంటి వారి ట్రీట్మెంట్ కోసం, అలాగే ముందస్తు నివారణ కోసం హోమియోలో ప్రత్యేకంగా మందులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. షుగర్ కంట్రోల్లోని లేనివారు, కరోనా ట్రీట్మెంట్లో ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడిన పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ సోకిన కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని వర్షిణి అన్నారు. ఈ వ్యాధి సోకిన రోగులు ఆర్సెనికంఅల్బమ్200 మందును రోజుకు రెండు సార్లు ఆరు గోళీల చొప్పున ఐదురోజుల పాటు, ఫైవ్ఫాస్6ఎక్స్ మందును రోజుకు రెండు సార్లు మూడు గోళీల చొప్పున 30 రోజులు వాడితే బ్లాక్ ఫంగస్ నయమవుతుందని చెప్పారు. వీటిని హోమియో డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలని సూచించారు.