NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Second Wave: సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. 594 మంది డాక్టర్లు మృతి..! ఐఎమ్ఏ వెల్లడి

doctors death rate shocking in second wave

Second Wave: సెకండ్ వేవ్ Second Wave: కరోనా వైరస్ సెకండ్ వేవ్ భారత్ లో ఎంతటి విధ్వంసం సృష్టించిందో తెలిసిందే. కరోనాతో మృతి చెందిన వారు ఎక్కువే.. ఆక్సిజన్ అందక మృతి చెందిన వారూ ఎక్కువే. ఓదశలో కేంద్రం కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ప్రపంచదేశాలు స్పందించాయి. స్వచ్చంధ సంస్థలు స్పందించాయి. కొందరు స్వచ్చదంగా స్పందించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు అందజేశారు.. చిరంజీవి, సోనుసూద్ ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పిన విషయమూ తెలిసిందే. అయితే.. సెకండ్ వేవ్ మరణాల్లో డాక్టర్లు కూడా మృతి చెందడం విచారించదగ్గ విషయం. ఇంతటి విపత్తులో కూడా నిర్విరామంగా సేవలందించిన డాక్టర్ల మృతిపై మెడికల్ అసోసియేషన్ స్పందించింది.

doctors death rate shocking in second wave
doctors death rate shocking in second wave

ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలు అందించిన డాక్టలు ఈ మహమ్మారికి బలైపోవడం ఎంతో బాధాకరం. ఇప్పటివరకూ మొత్తంగా 594 మంది డాక్టర్లు మృతి చెందినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలపి ఈ సంఖ్యలో మరణించినట్టు వివరాలు సేకరించింది. అత్యధికంగా ఢిల్లీ వీరి మరణాల్లో ముందుంది. ఇక్కడ 108 మంది డాక్టర్లు కరోనా వల్ల మృతి చెందారు. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్-98, ఉత్తరప్రదేశ్-67 నిలిచాయి. ఆపై.. ఆరు రాష్ట్రాల్లో 25 నుంచి 50 మంది, రాజస్థాన్-43, ఝార్ఖండ్-39, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల్లో 32 మంది చొప్పున, తమిళనాడు-21, మహారాష్ట్ర-17, మధ్యప్రదేశ్-16, ఆపై.. 12 రాష్ట్రాలు, ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకొక్కరు చొప్పున మరణించారు.

Read More:Chiranjeevi Oxygen Banks: చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్..! నిన్న కర్ణాటకలో.. నేడు గుంటూరులో.. ప్రారంభం

ఈ సందర్భంగా ఐఎమ్ఏ స్పందించి. ‘డాక్టర్లు, సిబ్బందని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి కేంద్రం వ్యాక్సినేషన్ వేయించింది. అయితే.. ఆయాచోట్ల డాక్టర్లపై దాడులు జరిగాయి. ఆసుపత్రిలో రోగి మృతి చెందితే రోగి బంధువు దాడి చేశారు. ప్రాణాలకు తెగించి వైద్యులు చికిత్స అందించినా ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. ఇటువంటి దాడులను అరికట్టేందుకు కేంద్రం కొత్త చట్టం తీసుకురావాలి. లేదంటే.. ఇటువంటి సంఘటనలు డాక్టర్లపై ఒత్తిడి పెంచుతాయి. అంత ఒత్తడి మధ్యలోనే వారూ పని చేయాల్సి వస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయాల్సి ఉంది’ అని ఓ ప్రకటనలో ఐఎమ్ఏ కోరింది.

 

Related posts

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?