Moderna Vaccine: దేశంలోకి మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. ఆమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతుల కోసం ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా కేంద్రానికి ధరఖాస్తు చేసుకోగా కేంద్ర ఔషద నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. మోడెర్నా డోసుల దిగుమతి, మార్కెటింగ్ అనుమతుల కోసం సిప్లా సోమవారం నాడు డీసీజీఐకి ధరఖాస్తు చేసుకున్నది. ఈ ధరఖాస్తును పరిశీలించిన డీసీజీఐ..మోడెర్నా వ్యాక్సిన్ పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం.
వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన తరువాత తొలి వంద మంది లబ్దిదారులకు సంబంధించి ఏడు రోజుల ఆరోగ్య పరిస్థితిని సంస్థ సమర్పించాలని డీసీజీఐ సూచించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకూ భారత్ లో స్వదేశీ వ్యాక్సిన్ లు కోవాగ్జిన్, కోవిషీల్డ్ తో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా నాల్గవ కరోనా వ్యాక్సిన్ గా మెడెర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది.
Read more: CBI Court: విశ్రాంత ఐఏఎస్ రాజగోపాల్కు సీబీఐ షాక్..!!
మోడెర్నా వ్యాక్సిన్ ను మెసెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ తో అభివృద్ధి చేశారు. క్లినికల్ ప్రయోగాలలో 90 శాతానికి పైగా సమర్థవంతంగా పని చేసింది. ఆమెరికాతో పాటు యూరప్ దేశాల్లో ఎక్కువగా ఫైజర్ తో పాటు మోడెర్నా వ్యాక్సిన్ నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దేశంలో వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో విదేశీ వ్యాక్సిన్ లను అందుబాటులోకి తెచ్చేలా ఇటీవల డీసీజీఐ అనుమతి ప్రక్రియల్లో కొన్ని మార్పులు చేసింది. విదేశాలలో అనుమతి పొందిన వ్యాక్సిన్లకు భారత్ లో క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని కేంద్రం గతంలోనే వెల్లడించింది. ఈ నేపథ్యంలో మోడెర్నా వ్యాక్సిన్ ను భారత్ లోకి తీసుకొచ్చేందుకు సిఫ్లా.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!