NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

NREGS Pending Bills: హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తుంది ఎవరు..? కేంద్రమా..? రాష్ట్ర ప్రభుత్వమా..?

NREGS Pending Bills: రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి కోట్లాది రూపాయలు బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. గడచిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి రావడంతో ఎన్ఆర్ఈజీఎస్ కింద జరిగిన పనులకు సంబంధించి బిల్లులను చెల్లించలేదు. నెలలు గడుస్తున్నా పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పలువురు కాంట్రాక్టర్ లు హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై విజిలెన్స్ విచారణ జరుపుతున్న కారణంగా ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడుదల చేయడం లేదు. దాదాపు 1500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుల విషయంలో కోర్టును తప్పుదోవ పట్టించే పరిస్థితులు నెలకొన్నాయి.

పలువురు కాంట్రాక్టర్ లు దాఖలు చేసిన పిటిషన్ల పై హైకోర్టు విచారణ జరుపుతుండగా కోర్టు అనే గౌరవం అనేది కూడా లేకుండా తప్పుడు సమాచారం ఇవ్వడం గమనార్హం. అయితే ఈ తప్పుడు సమాచారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమా, లేక రాష్ట్ర ప్రభుత్వమా అనేది తేలాల్సి ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటికే 400 కోట్ల రూపాయలు చెల్లించామనీ, మరో 1100 కోట్ల రూపాయలను మరో వారం రోజుల్లో చెల్లిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. నిధులను పంచాయతీల ఖాతాల్లో జమ చేసినట్లు కోర్టు విచారణకు హజరైన ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది. ఎస్ఎస్ రావత్ తెలిపారు నగదు నేరుగా కాంట్రాక్టర్ లకు చెల్లించకుండా పంచాయతీ అకౌంట్ లలో వేసి వేధిస్తున్నారని పిటిషన్ ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  దీనిపై స్పందించిన ధర్మాసనం పెండింగ్ బకాయిలను గుత్తేదారులకు చెల్లించి వివరాలను హైకోర్టుకు నివేదించాలని ఆదేశించారు.

 

కేంద్రం నుండి ఇంకా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయగా, తాము మొత్తం చెల్లించామని కేంద్రం తరపు న్యాయవాది తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు భిన్నంగా ఉండటంతో పూర్తి వివరాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల చెల్లింపు విషయంలో హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమా..? లేక రాష్ట్ర ప్రభుత్వమా? అనేది తదుపరి విచారణలలో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

 

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N