Breaking: తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు యాక్సిడెంట్ కి గురి కావడం జరిగింది. అతి వేగంగా ప్రయాణిస్తూ రోడ్డుపై 2,3 బోల్తాలు పడటంతో బస్సు నుజ్జు, నుజ్జు గా మారింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి వారిని సమీపంలోని ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. కాకినాడ నుండి హైదరాబాద్ కి బయలుదేరుతున్న ఈ ప్రైవేటు బస్సులో మొత్తం 33 మంది ఉన్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు గుర్తించారు. సరిగ్గా ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల ఆకుపాములో జరిగింది. మంచి స్పీడ్ మీద… వెళ్తున్న బస్సు రోడ్డు పై రెండు మూడు పిల్టిళ్లు కొట్టడంతో… బస్సులో ప్రయాణిస్తున్న 33 మందిలో 15 మందికి చాలా దారుణమైన గాయాలు.. అయ్యాయి. కాకినాడ నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్న టైములో ఈ ఘటన సంభవించింది.