NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

NREGS Pending Bills: హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తుంది ఎవరు..? కేంద్రమా..? రాష్ట్ర ప్రభుత్వమా..?

NREGS Pending Bills: రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి కోట్లాది రూపాయలు బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. గడచిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి రావడంతో ఎన్ఆర్ఈజీఎస్ కింద జరిగిన పనులకు సంబంధించి బిల్లులను చెల్లించలేదు. నెలలు గడుస్తున్నా పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పలువురు కాంట్రాక్టర్ లు హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై విజిలెన్స్ విచారణ జరుపుతున్న కారణంగా ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడుదల చేయడం లేదు. దాదాపు 1500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుల విషయంలో కోర్టును తప్పుదోవ పట్టించే పరిస్థితులు నెలకొన్నాయి.

పలువురు కాంట్రాక్టర్ లు దాఖలు చేసిన పిటిషన్ల పై హైకోర్టు విచారణ జరుపుతుండగా కోర్టు అనే గౌరవం అనేది కూడా లేకుండా తప్పుడు సమాచారం ఇవ్వడం గమనార్హం. అయితే ఈ తప్పుడు సమాచారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమా, లేక రాష్ట్ర ప్రభుత్వమా అనేది తేలాల్సి ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటికే 400 కోట్ల రూపాయలు చెల్లించామనీ, మరో 1100 కోట్ల రూపాయలను మరో వారం రోజుల్లో చెల్లిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. నిధులను పంచాయతీల ఖాతాల్లో జమ చేసినట్లు కోర్టు విచారణకు హజరైన ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది. ఎస్ఎస్ రావత్ తెలిపారు నగదు నేరుగా కాంట్రాక్టర్ లకు చెల్లించకుండా పంచాయతీ అకౌంట్ లలో వేసి వేధిస్తున్నారని పిటిషన్ ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  దీనిపై స్పందించిన ధర్మాసనం పెండింగ్ బకాయిలను గుత్తేదారులకు చెల్లించి వివరాలను హైకోర్టుకు నివేదించాలని ఆదేశించారు.

 

కేంద్రం నుండి ఇంకా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయగా, తాము మొత్తం చెల్లించామని కేంద్రం తరపు న్యాయవాది తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు భిన్నంగా ఉండటంతో పూర్తి వివరాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల చెల్లింపు విషయంలో హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమా..? లేక రాష్ట్ర ప్రభుత్వమా? అనేది తదుపరి విచారణలలో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju