BREAKING: csajjanar తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకు పనిచేసిన సజ్జనార్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జనార్ 3 సంవత్సరాలకు పైగా సైబరాబాద్ సిపి గా సేవలు అందించారు. ఈ సమయంలో ఆయన అనేక కేసులను దర్యాప్తు చేయడంలో కీలక పాత్ర వహించారు. ముఖ్యంగా దిశ అత్యాచారం జరిగిన సమయంలో ఆయన వ్యవహరించిన విధానం, ఆ తర్వాత జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
BIG BREAKING: సీఎం జగన్ బెయిల్ రద్దు తీర్పులో ఆఖరి నిమిషం లో ట్విస్ట్ ఇచ్చిన జడ్జిగారు..!
ఇక కొత్తగా నియమితులైన స్టీఫెన్ రవీంద్ర పోలీస్ శాఖలో పట్టు సాధించిన అధికారిగా మంచి పేరు ఉంది. ఇది వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఆయన నక్సల్స్ ను అరికట్టడంలో ముఖ్య పాత్ర వహించారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో స్టీఫెన్ రవీంద్ర పై టిఆర్ఎస్ పార్టీ నేతలు అనేకసార్లు ఆరోపణలు గుప్పించారు.
AP CM YS Jagan: జగన్ బెయిల్ రద్దుపై సర్వత్రా ఉత్కంఠ..! నేడే సీబీఐ కోర్టు తీర్పు..!!