Kalava Srinivasulu: ఏపిలో టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసుల నమోదు పరంపర కొనసాగుతునే ఉంది. టీడీపీ నేతలు బయటకు వచ్చి ఏదేనా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తే వెంటనే వారిపై కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ పరిణామాలు టీడీపీ శ్రేణులను ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి, ఆయన అనుచరులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. పేట్రోల్, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా టీడీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు ధర్నాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పోలీసులపై దురుసుగా ప్రవర్తించారనీ, వారి విధులకు ఆటంకం కల్గించారన్న అభియోగంపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మరో పక్క అనంతపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. దీనిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కాల్వ శ్రీనివాసులుతో పాటు మరో 78 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. బొమ్మనహల్ ఎస్ఐ రమణారెడ్డి సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడితే కేసులు నమోదు చేయడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకేనా, అధికార పక్షానికి వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
1.Breaking: సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారి..!!
2.AP Capital: రాజధానిపై బీజేపీ చాటు రాజకీయం..! దొంగాట..? దొడ్డిదారా..!?
3.YV Subba Reddy: టీటీడీలో నిత్య అన్నదాన పథకం అమలుపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇదీ..