Bharat Bandh: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ మద్దతు ప్రకటించలేదు. ఏపిలో అధికార వైసీపీతో సహా టీడీపీ, కాంగ్రెస్ , వామ పక్షాలు, రైతు, ప్రజా, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏపిలో బస్సు సర్వీసులను మధ్యాన్నం వరకూ నిలుపుదల చేస్తున్నట్లు ఆర్ టీసీ ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. బీజెపి , జనసేన బంద్కు దూరంగా ఉన్నాయి.
వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్చందగా మూసివేసి బందుకు సహకరించాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పట్టణాల్లో నగరాల్లో రైతు కార్మిక సంఘాల నేతలు పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అటు తెలంగాణలో బస్ డిపోల వద్ద రైతు సంఘాల అందుకు మద్దతుగా ఆందోళనలు నిర్వహించారు. డిపోల నుండి బస్సులు బయటకు రాకుండా అనుకున్నారు. జాతీయ రహదారులపై నిరసనలు తెలుపుతున్నారు.