వయనాడ్: కేరళలోని వయనాడ్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ వెంట ఆయన సోదరి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.
నామినేషన్ వేసేందుకు నిన్న రాత్రే రాహుల్ కోళికోడ్ చేరుకున్నారు. ఆయన వచ్చిన కొద్దిసేపటికే ప్రియాంక గాంధీ కూడా చేరుకున్నారు. రాత్రి కోళికోడ్లోని గెస్ట్హౌస్లో బస చేసిన రాహుల్, ప్రియాంకలు ఈ ఉదయం హెలికాప్టర్లో వయనాడ్కు వచ్చారు.
వయనాడ్ చేరుకున్న రాహుల్ గాంధీ నామినేషన్కు ముందు నగరంలో రోడ్షో చేపట్టారు. వందలాది మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నడుమ రాహుల్ కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా చేరుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని అమేఠీతో పాటు వయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వయనాడ్లో కాంగ్రెస్కు మంచి పట్టుంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎంఐ షానావాస్ ఇక్కడ విజయం సాధించారు.
అయితే ఈసారి అమేఠీతో పాటు దక్షిణాది నుంచి పోటీ చేయాలన్న పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు రాహుల్ వయనాడ్ను ఎంచుకున్నారు. సిపిఐ నేత పిపి సునీర్, ఎన్డిఏ అభ్యర్థి తుషార్ వెల్లపల్లితో రాహుల్ తలపడనున్నారు.