TDP MLA Ganta Srinivasa Rao: ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను నిరసిస్తూ గత ఏడాది ఫిబ్రవరి 21న గంటా శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేశారు. అయితే తన లేఖపై స్పీకర్ తమ్మినేని ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తన రాజీనామాను ఆమోదించకపోవడం సరికాదని అన్నారు. తక్షణం తన రాజీనామాను ఆమోదించాలని గంటా శ్రీనివాసరావు లేఖలో పేర్కొన్నారు. ఏడాదికి పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు చర్యలు చేపట్టలేదని ఆయన లేఖలో ప్రస్తావించారు.
Read More: CM YS Jagan: సీఎం జగన్ నోట మంత్రివర్గ విస్తరణ మాట..? కేబినెట్ లో హాట్ డిస్కషన్..!!
TDP MLA Ganta Srinivasa Rao: రాజీనామా ఆమోదించాలంటూ..
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వారి పోరాటాల్లో పాలుపంచుకున్నారు. అనాడు కార్మికుల ఆందోళన శిబిరంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గంటా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అ తరువాత రాజీనామా లేఖను ఏపి అసెంబ్లీకి పంపించారు. గంటా రాజీనామా చేసి ఏడాది దాటినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో గంటా తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని లేఖ రాయడంతో స్పీకర్ తమ్మినేని వెంటనే నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.