Samantha: గత కొన్నేళ్ల నుంచి దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న సమంత.. ఇటీవలె భర్త, అక్కినేని హీరో నాగ చైతన్యతో విడిపోయి వైవాహిక జీవితానికి స్వస్థి పలికిన సంగతి తెలిసిందే. `ఏం మాయ చేసావే` సినిమాతో మొదలైన వీరిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత ఇరుకుటుంబసభ్యులను ఒప్పించిన సామ్, చైతులు 2017 అక్టోబర్ 7న గోవాలో రెండు సాంప్రదాయాల ప్రకారం అట్టహాసంగా వివాహం చేసుకున్నారు.
అప్పట్లో వీరి పెళ్లి టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. కానీ, ఏం లాభాం వివాహమై నాలుగేళ్లు గడవక ముందే ఈ జంట.. విడాకుల వైపు టర్న్ తీసుకుని ఎవరూ ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఒంటిరిగా ఉంటున్న సమంత.. త్వరలోనే ఓ ఇంటిది కాబోతోందట. విడాకులు తర్వాత ఈ బ్యూటీ ఓ న్యూ స్టెప్ వేయబోతోందట.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైతు నుంచి విడిపోయినా సామ్ మాత్రం భర్తతో గడిపిన అదే ఫ్లాట్లో నివాసం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ భామ ఇల్లు మారాలని భావిస్తుందట. ఈ నేపథ్యంలోనే ముంబైలో ఓ కాస్లీ ఏరియాలో దాదాపు మూడు కోట్లు వెచ్చించి ఓ అదిరిపోయే హౌస్ను కొనుగోలు చేసిందట. ప్రస్తుతం ఆ ఇంటిని తనకు నచ్చినట్లు సామ్ మార్చుకుంటుందని.. త్వరలోనే కొత్త ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేయనుందని టాక్ నడుస్తోంది.
పైగా సమంత తరచూ ముంబై వెళ్లి వస్తుండటంతో.. ఈ ప్రచారం నిజమే అని చాలా మంది భావిస్తున్నారు. మరి దీనిపై మరి కొద్ది రోజుల్లో మరింత స్పష్టత రానుంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` అనే పాన్ ఇండియా మూవీని పూర్తి చేసుకుని సామ్ ఇప్పుడుడు `యశోద`, తమిళ చిత్రం `కాథువాకుల రెండు కాదల్`, డ్రీమ్ వారియర్స్ ప్రొడక్షన్పై ఓ సినిమా చేస్తుంది. అలాగే బాలీవుడ్లో కూడా మూడు ప్రాజెక్ట్స్ను టేకప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!