NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

JC Prabhakar Reddy: జేసీ ప్రభాకరరెడ్డి కీలక ప్రకటన..రాజకీయ సన్యాసం అంటూ..!

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డి కీలక ప్రకటన చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జేసీ బ్రదర్స్ రాజకీయాలకు దూరంగా ఉండేందుకు వారి వారసులను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. అయితే జేసీ దివాకరరెడ్డి, జేసి ప్రభాకరరెడ్డిల కుమారులు అనంతపురం లోక్‌సభ, తాడిపత్రి అసెంబ్లీ స్థానాల నుండి టీడీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. ఇక అనివార్య పరిస్థితిలో జేసి ప్రభాకరరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసి తను గెలవడంతో పాటు తన వర్గీయులను గెలిపించుకుని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని రెండవ సారి అధిష్టించారు. రాష్ట్రంలో టీడీపీ గెలుచుకున్న ఏకైక మున్సిపాలిటీగా తాడిపత్రి గుర్తింపు దక్కించుకుంది.

JC Prabhakar Reddy key comments on political journey
JC Prabhakar Reddy key comments on political journey

JC Prabhakar Reddy: చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తరువాత..

తాజాగా జేసీ ప్రభాకరరెడ్డి తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు. అయితే చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తరువాత రాజకీయాల నుండి తప్పుకుంటానని పేర్కొన్నారు. కళ్యాణదుర్గంలో నిర్వహించిన టీడీపీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే నాయకులపై రౌడీ షీటర్ కేసులు నమోదు చేస్తే భయపడేది లేదని అన్నారు. కల్యాణదుర్గంలో చిన్నారి మృతిపై న్యాయ విచారణ జరిపించాలని ప్రకాష్ నాయుడు నిరసన తెలియజేస్తే అతనిపై రౌడీ షీట్ తెరుస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదన్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపేలా మరింత పని చేస్తామన్నారు.

విమర్శలు గట్టిగానే చేయగలం

ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలపైనా జేసి ప్రభాకరరెడ్డి స్పందిస్తూ..గతంలో ఉషశ్రీ చరణ్ ఏ పార్టీలో ఉన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. వాళ్లపై కర్ణాటక లోకాయుక్త, సుప్రీం కోర్టు లో ఉన్న కేసుల విషయం చెప్పమంటారా అని ప్రశ్నించారు. వాళ్ల కంటే గట్టిగానే తాను విమర్శలు చేయగలననీ, మొత్తం చెప్పగలననీ కానీ మహిళ కనుక అన్ని విషయాలు చెప్పడం లేదని అన్నారు జేసి. తన తండ్రి చనిపోతే మూడేళ్ల పాటు శవరాజకీయాలు చేసింది వైఎస్ జగన్మోహనరెడ్డి అని, ఇప్పుడు మంత్రి ఉష శ్రీ చరణ్ వచ్చి తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ విమర్శలు చేయడం మాని మృతి చెందిన బాలిక తండ్రి వికలాంగుడని, కావున మానవత్వంతో స్పందించి ఆ కుటుంబానికి పెన్షన్ ఇప్పించాలని విజ్ఞఫ్తి చేశారు. అది చేస్తే మంత్రి ఇంటికి వెళ్లి మరీ సన్మానం చేస్తానన్నారు జేసీ.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju