NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Assembly segments: ఏపిలో అసెంబ్లీ సీట్ల పెంపు..!?కేంద్రంతో కీలక చర్చలు..!

Assembly segments:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో విభజన చట్టం తీసుకువచ్చారు. ఆ విభజన చట్టంలో అనేక హామీలను కేంద్రం ఇచ్చింది. అందులో ప్రధానమైనది ఏపికి ప్రత్యేక హోదా. ఆ తరువాత రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా. అదే విధంగా రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి అనుమతులు ఇవ్వడం వంటి వాటితో పాటు మరో ముఖ్యమైనది  రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంపు అంశం ఉంది. ఇవన్నీ కూడా చట్టబద్దంగా కేంద్రం ఇచ్చిన హామీలు. అయితే ఈ చట్టంలో కొన్ని అమలు అయ్యాయి. కొన్ని అమలు కాలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. దానికి అనేక కారణాలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు జరగలేదు. 2014 నుండి 2019లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపిలో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి చాలా లాబీయింగ్ జరిగింది. తీవ్ర ప్రయత్నాలు చేశారు. అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్న భావనతోనే చాలా మందిని పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఎన్నికల సమయానికల్లా అసెంబ్లీ సీట్లు పెరగకలేదు. 2027 వరకూ అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యం కాదని కేంద్రం చెప్పడంతో చంద్రబాబు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

Assembly segments increased issue
 Assembly segments increased issue

Assembly segments: కేసిఆర్ ఘాటు లేఖతో తెరపైకి అసెంబ్లీ సీట్ల పెంపు అంశం

అయితే ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ సీట్ల పెంపు అంశం తెరమీదకు వచ్చింది. ఏపి సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై మాట్లాడటం లేదు కానీ తెలంగాణ సీఎం కేసిఆర్ కేంద్రానికి లేఖరాశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీ స్థానాలు పెంచాలంటూ కేంద్రానికి సీఎం కేసిఆర్ ఘాటుగా లేఖ రాశారు. దీనిపై కేంద్రం స్పందించకుంటే న్యాయపోరాటం చేస్తామని కూడా పేర్కొన్నారు. ఒక వేళ కేంద్రం కేసిఆర్ లేఖకు స్పందిస్తే తెలంగాణతో పాటు ఏపిలోనూ అసెంబ్లీ స్థానాల పెంపు ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా అవి 153 వరకూ పెరిగే అవకాశం ఉంది. అలానే ఏపి విషయానికి వస్తే ప్రస్తుతం 175 స్థానాలు ఉండగా అవి 229 స్థానాల వరకూ పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్రం ఒప్పుకుంటే కొత్తగా ఏపిలో 54 స్థానాలు వస్తాయి.

 

జనగణన పూర్తి అయితేనే..

ఇదే జరిగే నియోజకవర్గాల భౌగోళిక స్వరూపాలు మారతాయి. అసెంబ్లీ సీట్ల పెంపునకు ఓ చిన్న అడ్డంకి కనబడుతోంది. అసెంబ్లీ సీట్ల పెంపు చేయాలంటే జనగణన, కుల గణన పూర్తి కావాలి. అదే విధంగా ఎకనమిక్ సర్వే పూర్తి కావాలి. పదేళ్లకు ఒక సారి జరిగే జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది. ఒక వేళ జనగణన పూర్తి అయినా అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు మార్చాలంటే పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన 2008లో జరిగినందున మరల 2027లోనే చేస్తారని టాక్. ఏమి జరుగుతుందో వేచి చూడాలి. వడ్డించేవాడు మన వాడు అయితే బంతిలో చివరన ఉన్నా అన్నీ అందుతాయి అన్నట్లు కేంద్రం తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella