Mega Fans: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటే తాము నడుస్తామని అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు తెలిపారు. విజయవాడలోని మురళి ఫార్చూన్ హోటల్ నందు ఆదివారం పవన్, చిరు, రామ్ చరణ్ అభిమాన సంఘాల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ వెంట నటుస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జనసేన అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తామని, అందు కోసం కార్యాచరణ సిద్దం చేస్తామని ఆయన తెలిపారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నాయకులకు, అభిమానులకు మధ్య అంతరాలు ఏమి లేవనీ, పార్టీ ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళతామని చెప్పారు,. మెగా అభిమానులు అందరూ జనసేన కార్యకర్తలుగా పని చేస్తామని తెలిపారు. ఇదే సందర్భంలో పొత్తుల అంశం గురించి మాట్లాడుతూ ఇది తమ పరిధిలోనిది కాదనీ, పెద్దలు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. గతంలో ప్రజారాజ్యంపై అనేక కుట్రలు చేశారని అయినప్పటికీ కుటుంబాలను వదిలి ఆనాడు చిరంజీవి కోసం పని చేశామని అన్నారు స్వామినాయుడు.
జనసేనపైనా ఇప్పుడు అసత్యాలు, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మెగా అభిమానులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామనీ, ఈ కార్యక్రమంలో భాగంగా త్వరలో నాగబాబు అభిమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. నాదెండ్ల మనోహర్, నాగబాబు ఆదేశాలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.