YS Jagan: ఏపీ సీఎం జగన్ తిరుపతి- శ్రీకాళహస్తి పర్యటనలో ఉన్నారు. ముందుగా తిరుపతి రూరల్ మండలం పేరూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణమైన వకుళమాత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం వకుళమాతని మొట్టమొదటిగా సీఎం జగన్ దర్శించుకున్నారు.ఆ తర్వాత శ్రీకాళహస్తిలో సమీపంలో ఇనగలూరులో ఏర్పాటుచేసిన అపాచీ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రసంగిస్తూ.. అపాచీ పరిశ్రమ ద్వారా నేరుగా పదివేల ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దాదాపు 800 కోట్ల రూపాయలతో నిర్మాణాలు స్టార్ట్ అవుతాయి అని తెలిపారు. ఇదే అపాచీ గ్రూప్ సంస్థ 2006వ సంవత్సరం లోనే నాన్న గారి హయాంలో తడలో పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం తడ లో… ఇదే కంపెనీలో దాదాపు 15 వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. అందులో కూడా దాదాపు 60 శాతం మంది మహిళలే ఉద్యోగస్తులు. ఇక ఇదే అపాచీ పరిశ్రమ పులివెందల లోనే రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. త్వరలో తొమ్మిది వేల మందికి ఉపాధి కల్పించేలా అక్కడ క్లస్టర్ ప్రణాళికలు వేస్తుంది.
కాగా ప్రస్తుతం ఇనగలూరులో శంకుస్థాపన చేసిన కంపెనీ వచ్చే సెప్టెంబర్ నుండి అందుబాటులోకి రానుంది. అయితే ఈ పరిశ్రమలో దాదాపు 80 శాతం మంది మహిళలేకే ఉపాధి లభించనుంది అని అక్కడ మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దాదాపు పదిహేను వేలమందికి నేరుగా ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి అవసరం కావాల్సి వచ్చిన ఒక్క ఫోన్ కాల్ చాలు అపాచీ పరిశ్రమ యాజమాన్యానికి సీఎం జగన్ భరోసా ఇచ్చారు.