NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP Plenary: వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తారా..? రారా..?.. సజ్జల ఇచ్చిన క్లారిటీ ఇది..!!

YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా జరుగుతున్న ఈ ప్లీనరీని బ్రహ్మాండంగా నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీనరీ ప్రాంగణం ఏర్పాట్లను బుధవారం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డిలు పలువురు ముఖ్యనేతలతో కలిసి పరిశీలించారు. అయితే ప్లీనరీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ హజరు అవుతారా ..? లేదా అన్న సందేహాలు కొద్ది రోజులుగా వినబడుతున్నాయి.

Sajjala Vijayasai Visit YCP Plenary campus
Sajjala Vijayasai Visit YCP Plenary campus

YCP Plenary: గౌరవాధ్యక్షురాలి హోదాలో ప్లీనరీకి విజయమ్మ

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టిన నాటి నుండి విజయమ్మ ఆమె వెన్నంటే ఉంటున్నారు. అక్కడి వైఎస్ఆర్ టీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాల్లోనూ షర్మిలతోనే కలిసి పాల్గొన్నారు కానీ కుమారుడు జగన్ తో వేదికను పంచుకోలేదు అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కొద్ది రోజులుగా వైఎస్ విజయమ్మ పార్టీ ప్లీనరీకి వస్తారా..? రారా..? అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయమ్మ ప్లీనరీలో పాల్గొంటారని చెప్పారు. గత ప్లీనరీలో నవరత్నాలు ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చామనీ, ఈ సారి మరిన్ని మెరుగైన కార్యక్రమాలు చేపట్టి తిరిగి అధికారంలోకి వస్తామని సజ్జల పేర్కొన్నారు. ప్లీనరీకి వచ్చే నాయకులకు స్వయంగా సీఎం జగన్ అహ్వానిస్తారని చెప్పారు. ప్రతి వార్డు స్థాయి కార్యకర్తకు పార్టీ అధ్యక్షుడి సంతకంతో ఆహ్వానం ఉంటుందని తెలిపారు.

“కిక్ బాబు ఔట్” నినాదంతో

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచేందుకు ప్లీనరీలో అవసరమైన కార్యచరణపై దృష్టి సారిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో “కిక్ బాబు ఔట్” నినాదంతో ముందుకు వెళతామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్లీనరీ నిర్వహిస్తున్నామనీ, మళ్లీ అధికారంలోకి వచ్చాక మరల ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. తమ ప్లీనరీ సమావేశాలు మిగతా పార్టీ వారికి భిన్నంగా ఉంటాయన్నారు విజయసాయిరెడ్డి. జూలై 8వ తేదీన అధ్యక్షుడు ప్రారంభ ఉపన్యాసం చేస్తారనీ, 9వ తేదీ ముగింపు స్పీచ్ ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju