NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

నీతి అయోగ్ సమావేశానికి వెళితే పోను రాను ఖర్చులు దండగ తప్ప వచ్చేది ఏమి ఉండదు.. అందుకే బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్న తెలంగాణ సీఎం కెసిఆర్

Telangana CM KCR Cabinet Meet

రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మరో సారి తూర్పర బట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. నీతి అయోగ్ సమావేశాన్ని తాము ఎందుకు బహిష్కరిస్తున్నది తెలియచేయడానికి శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నీతి అయోగ్ సమావేశంలో నాలుగు నిముషాలు మాట్లాడేందుకు నాలుగు గంటలు కూర్చోవాలి, అంత సేపు కూర్చొని మనం చెప్పిన విషయాలపై ఏమైనా స్పందన ఉంటుందా అంటే ఏమి ఉండదు. నీతి అయోగ్ సిఫార్సు లను కేంద్రం పట్టించుకోదు. వాళ్ళు చేసేదే చేస్తారు. రక్షణ రంగంలో పాలసి మార్పులపై ఏమైనా చర్చించారా అని ప్రశ్నించారు కెసిఆర్. దేశ ఆర్ధిక వ్యవస్థ ను మోడీ సర్కార్ సర్వ నాశనం చేసిందని దుయ్య బట్టారు. మోడీ వ్యక్తి గతంగా తనకు మంచి మిత్రుడే కానీ ప్రజా వ్యతిరేక విధానాలు ఆవలంబిస్తున్నప్పుడు వాటిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పారు.

 

సమాఖ్య స్ఫూర్తి కి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ పాలన నడుస్తుందని ఘాటుగా విమర్శించారు కెసిఆర్. చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించి ఆదివారం జరుగుతున్న నీతి అయోగ్ సమావేశాన్ని బాయ్ కాట్ చేసినట్లు చెప్పారు. తమ నిరసనను బహిరంగ లేఖ ద్వారా నేరుగా ప్రధానికి తెలియజేస్తున్నామని తెలిపారు కెసిఆర్. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాను రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా నీతి ఆయోగ్‌ ను తీసుకోని వచ్చిందని కానీ, దురదృష్టవశాత్తు నిరర్థక సంస్థగా మారిందని విమర్శించారు. నేతి బీరకాయలో నెయ్యి అన్న చందంగా నీతి ఆయోగ్‌ పరిస్థితి తయారైందని అన్నారు. దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా 13 నెలల పాటు రైతులు ఆందోళన చేసారన్నారు. చివరకు నల్ల చట్టాలు రద్దు చేసి ప్రధాని స్వయంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారని, ఆదాయం రెట్టింపు కాకపోగా ఖర్చులు రెట్టింపయ్యాయిని చెప్పారు. దేశంలో సాగుకు నీరు లభించడం లేదు, విద్యుత్‌ లేదు, బీజేపీ ఎనిమిదేళ్ల ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి జరిగిందని కెసిఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోందన్నారు. కేంద్ర – రాష్ట్ర ఉమ్మడి పథకాల్లో తెలంగాణ రూ.1.92లక్షల కోట్లు ఖర్చు చేస్తే అందులో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది రూ.5వేల కోట్లు మాత్రమే నని చెప్పారు కెసిఆర్. కేంద్రానికి తాము పంపించిన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. జీఎస్టీ బకాయిలు కూడా చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ విధానాల్లో, ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇదే విధానాలు కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కెసిఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో త్వరలో పది లక్షల మంది పేదలకు కొత్త గా పెన్షన్ లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. 75 ఏళ్ల ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా తెలంగాణ జైళ్లలో సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు కూడా బీమా అందిస్తామని సీఎం కెసిఆర్ వెల్లడించారు.

21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్న ఆ నలుగురు ప్రముఖులు

Related posts

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !