పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, ఆయన ప్రధాన అనుచరుడు చోటా షకీల్ తదితరుల ఆచూకీ తెలిపిన వారికి భారీ రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రకటించింది. 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం కీలక నిందితుడుగా ఉన్నాడు. దావూద్ ఇబ్రహీం ఆచూకి తెలిపిన వారికి రూ.25 లక్షలు, దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు చోటా షకీల్ ఆచూకీ చెబితే రూ.20లక్షలు ఇస్తామని ఎన్ఐఏ తెలిపింది. ఇదే కేసులో నిందితులైన అనీస్ ఇబ్రహీం, జావెద్ చిక్నా, ఇబ్రహీం ముస్తాక్, టైగర్ మెమన్ ల వివరాలు చెప్పిన వారికి ఒకొక్కరికి రూ.15లక్షల రివార్డు ఇస్తామని తెలిపింది.
వీరిని అరెస్టు చేసేలా సమాచారం ఇచ్చిన వారికి ఈ మేరకు నగదు బహుమతి అందిస్తామని ఎన్ఐఏ ప్రకటన విడుదల చేసింది. దావూద్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉగ్ర ముఠా డి కంపెనీపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. గత సంవత్సరం ఐక్య రాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ మాట్లాడుతూ .. దావూద్, ఇతరులు అందరూ లష్కరే తోయిబా, జేషే మొహమ్మద్, ఆల్ ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో కలిసి పని చేస్తున్నాయని తెలిపింది.
బంగారం , ఆయుధాలు స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ చలామణి చేస్తూ కార్యకలాపాలను కొనసాగించిన దావూద్ కు చెందిన డీ కంపెనీ రాత్రికి రాత్రే టెర్రరిస్ట్ సంస్థగా మారిపోయి 1993 లో ముంబాయి లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిందని పేర్కొంది. ఈ పేలుళ్లలో 250 మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 700 మందికిపైగా గాయపడ్డారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తినష్టం సంభవించింది. 2018లోనే దావూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అతను ప్రస్తుతం పాకిస్థాన్ లో ఆశ్రయం పొందుతున్నారు అనేది అధికారిక సమాచారం.
టీడీపీ ఆశలపై నీళ్లు చల్లిన ఏపీ బీజేపీ కో ఇన్ చార్జి సునీల్ ధియోదర్.. మ్యాటర్ ఏమిటంటే..?
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!