Combination: శెనగలు, ఖర్జూరం రెండింటి లోనూ ఎన్నో పోషకాలు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ఇది వరికి వీటిని చిరుతీల్లుగా తినేవాళ్ళం.. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి మారిపోయి.. ఆ లిస్ట్ లోకి పిజ్జా, బర్గర్, ఫాస్ట్ ఫుడ్స్ వీటిలోకి చేరిపోయాయి.. శనగలు ఖర్జూరం రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!
శనగలు, ఖర్జూరం కలిపి తినడం వలన చర్మానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి.. దీనివల్ల శరీరం ఆరోగ్యంతో పాటు చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఖర్జూర పళ్ళను సేవించడం వలన వృద్ధాప్య ఛాయలు ఆలస్యముగా వస్తాయి.. శారీరక బలహీనత, అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యలను చేదించడమే కాకుండా శరీరంలో ఐరన్ ని సమృద్ధిగా ఉంచుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది..
రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే ఎటువంటి వ్యాధులను అయినా జయించగలిగే బలం చేకూరుతుంది. తక్కువ బరువు ఉన్నవారు ఖర్జూరం తీసుకోవడం వలన వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్ ద్వారా బరువు పెరగటానికి సహాయపడతాయి. సెనగలు ఖర్జూరం రెండింటిని డైలీ ఉదయం అయినా సాయంత్రం అయినా తీసుకోవచ్చు.. ఇలా బలమైన ఆహారాన్ని శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ ని శరీరానికి అందిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము. శెనగలు, ఖర్జూరం రెండు కలిపి తీసుకోవడం వల్ల బరువు తక్కువగా ఉన్నవారికి రక్తహీనత సమస్య ఉన్నవారికి ఎక్కువగా మేలు కలుగుతుంది..