Pruthvi Raj: నటుడు కమెడియన్ పృథ్వీరాజ్ అందరికి సుపరిచితుడే. 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో ఎంతో పాపులర్ అయ్యాడు. కామెడీ పాత్రలు చేస్తూనే మరోపక్క నెగిటివ్ క్యారెక్టర్ లు కూడా పృథ్వీరాజ్ చేయడం జరిగింది. అంతేకాదు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటూ ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైయస్ జగన్ కి మద్దతు తెలిపారు. వైసీపీ పార్టీని గెలిపించాలని ప్రచారం కూడా చేశారు. అంతేకాదు జగన్ చేపట్టిన పాదయాత్రలో కూడా పాల్గొనడం జరిగింది. ఆ తరువాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక టీటీడీలో కీలక పదవి అధిరోహించారు.
అయితే టీటీడీలోనే ఓ మహిళతో రాసలీలలు జరిపాడు అనే పలు ఆరోపణలు కారణంగా పృథ్వీరాజ్ పదవి కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ నుండి బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో జాయిన్ అయ్యారు. నాగబాబు ఆధ్వర్యంలో పవన్ పార్టీలో జాయిన్ అయిన పృథ్వీరాజ్ వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన ధ్యేయమంటూ ఇటీవల పలు ప్రకటనలు చేయడం జరిగింది. ఇక ఇదే సందర్భంలో వైయస్ జగన్ కి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.
వైసీపీనీ ఓడించడానికి శాయశక్తుల కృషి చేస్తానని పలు ఇంటర్వ్యూలలో తెలియజేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే పృథ్వీరాజ్ కి విజయవాడ ఫ్యామిలీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పృథ్వీరాజ్… భార్య శ్రీలక్ష్మికి నెలకు 8 లక్షల రూపాయలు మరణం ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇచ్చింది. 1984లో వివాహం కాగా కొడుకు, కూతురు ఉన్నారు. అయితే భర్త తరుచు వేధిస్తూ 2016వ సంవత్సరంలో ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని శ్రీలక్ష్మి కేసు వేసింది. అతడు నెలకు ₹30 లక్షలు సంపాదిస్తాడని భరణం ఇప్పించాలని కోరింది. దీంతో విచారణ చేపట్టిన కోర్టు నెలకు ₹8 లక్షలు భరణం చెల్లించాలని పృథ్వీరాజ్ కి కోర్టు స్పష్టం చేసింది.