బాపట్ల జిల్లా కొరిశపాడు – రేణింగవరం మధ్య 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. ప్రధాన మంత్రి గతిశక్తి మిషన్ కింద బాపట్ల జిల్లాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్ వే నిర్మించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ జెట్స్, కార్గో విమానాలు ఇవేళ ఉదయం 11 గంటలకు సేఫ్ గా ఈ రన్ వేపై ల్యాండ్ అయ్యాయి. వచ్చే ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ రన్ వే ప్రారంభించే అవకాశం ఉండగా, గురువారం ట్రైయల్ రన్ నిర్వహించారు.
ఈ క్రమంలో భాగంగా ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 12.30 గంటల వరకూ హైవేపై ఆంక్షలు విధించారు. విజయవాడ వైపు నుండి వచ్చే వాహనాలను రేణంగివరం దగ్గర అద్దంకి వైపు మళ్లించారు. ఒంగోలు వైపు నుండి వచ్చే వాహనాలను మేదరమెట్ల దగ్గర అద్దంకి వైపు మళ్లించారు. సుమారు 200 మంది పోలీసులతో జిల్లా అధికారులు భద్రతా ఏర్పాటు చేశారు. రెండు సుఖోయ్ 35 ఫైటర్ జెట్స్, రెండు తేజస్ ఎల్సీఏ ఫైటర్ జెట్స్, ఒక ట్రాన్స్ పోర్టు విమానం ఏఎన్ 32 ట్రయల్ రన్ లో పాల్గొన్నాయి. అత్యవసర ల్యాండింగ్ సమయాల్లో సాధారణ ప్రజానీకం రన్ వే పైకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాలకు చెందిన పెద్ద సంఖ్యలో ప్రజలు రన్ వేకు దూరంగా నిల్చుని ట్రయల్ రన్ కార్యక్రమాన్ని వీక్షించారు.
#WATCH | Andhra Pradesh: A trial was conducted to land flights on National Highway 16 in Prakasam district. pic.twitter.com/FeiZYKCOdQ
— ANI (@ANI) December 29, 2022