NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తిరుమలలో డ్రోన్ విజ్యువల్స్ కలకలం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే..?

తిరుమల ఆలయాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. హైదరాబాద్ కు చెందిన సంస్థ సోషల్ మీడియాలో డ్రోన్ విజ్యువల్స్ ప్రసారం చేసినట్లుగా గుర్తించామనీ, సదరు సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. పటిష్ట భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్ తో చిత్రీకరించే అవకాశం లేదని అన్నారు. అయితే పాత చిత్రంతో యూనిమేట్ చేశారా అనే కోణంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డ్రోన్ చిత్రాలు, దృశ్యాలపై భక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదని చైర్మన్ వైవీ విజ్ఞప్తి చేశారు.

YV Subba Reddy

 

ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి వీలులేదనే నిబంధన ఉంది. బేడీ ఆంజనేయ స్వామి ఆలయం నుండి పశ్చిమ మాడవీధి వరకు దృశ్యాలు చిత్రీకరించారు. శ్రీవారి ఆనంద నిలయం, ఆనంద నిలయ గోపురాలకు దగ్గరగా చిత్రీకరణ చేశారు. నో ఫ్లై జోన్ గా ఉన్న తిరుమల లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ అంశాన్ని టీటీడీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.

డ్రోన్ రైడర్ 1 అనే యూట్యూబ్ ఛానెల్ లో గత ఏడాది నవంబర్ 13న వీడియోను అప్ లోడ్ చేసినట్లుగా ఉండగా, అదే వీడియోను ఐకాన్ ఫాక్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ లో ఈ నెల ఏడవ తేదీన పోస్ట్ అయినట్లు కనబడుతోంది. అదే వీడియోను గృహ శ్రీనివాస అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశారు.

డ్రోన్ లు ఎవరు ఎగురవేశారు అనే అంశంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఆస్థాన మండపం సమీపంలోని రోడ్లపై నుండి రెండు నెలల క్రితం డ్రోన్లను ఎగురవేసిన దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు. కాకులకోన వద్ద సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ వీడియోలు తీసేందుకు డ్రోన్ ఆపరేటర్లు అక్కడకు వచ్చినట్లు గుర్తించారు. మూడు నెలల ముందు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ వీడియోలను డ్రోన్లతో చిత్రీకరించేందుకు టీటీడీ అనుమతించింది. ఆ సమయంలో శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాలను డ్రోన్ ఆపరేటర్ లు చిత్రీకరించారు. దీంతో డ్రోన్లను ఎవరు ఎగురవేశారనే విషయంపై వెలుగులోకి వచ్చింది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju