NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నారా భువనేశ్వరి కంట్లో నీళ్ళు – చంద్రబాబు కూడా చూసి చలించిపోయిన ఘటన !

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కుప్పం నుండి ఇచ్చాపురం వరకూ 400 రోజుల పాటు నాలుగు వేల కిలో మీటర్లు ఈ యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే 2600 కిలో మీటర్లు పూర్తి అయ్యింది. తొలుత లోకేష్ తన తల్లిదండ్రులు నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం తీసుకుని పాదయాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత లోకేష్ పాదయాత్రలో భువనేశ్వరి కూడా ఒక రోజు పాల్గొన్నారు. ఆయితే ఆ సందర్భంగా మీడియాతో భువనేశ్వరి ఏమీ మాట్లాడలేదు. కానీ తాజాగా కుప్పంలో పర్యటనలో భువనేశ్వరి .. లోకేష్ పాదయాత్రపై, గతంలో వైసీపీ తమ కుటుంబం చేసిన కామెంట్స్ పై  స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ షేర్ చేసింది.

లోకేష్ పాదయాత్ర చేస్తాను అన్నప్పుడు తాను తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురి అయ్యాననీ, మొదట వద్దన్నానని చెప్పాననీ, కానీ లోకేష్ పట్టుబట్టడంతో సరే అని అన్నట్లు భువనేశ్వరి వెల్లడించారు. కానీ కన్నీళ్లు ఆపుకోలేకపోయానన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు ఇంతగా కష్టపడుతుంటే.. ప్రజలు, కార్యకర్తలు ఇంతగా ఇబ్బందులు పడుతుంటే వారికి నేను ఉన్నానని భరోసా ఇచ్చేందుకే లోకేష్ పాదయాత్ర చేయడం, పాదయాత్ర చేస్తున్న కొద్దీ లోకేష్ రాటుదేలాడనీ, అది చూసి తనకు సంతోషాన్ని కల్గిస్తొందని పేర్కొన్నారు భువనేశ్వరి. పాదయాత్రలో లోకేష్ స్వయంగా అనేక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

తాను ఫోన్ చేసి అడిగినా అంతా బాగుందని చెబుతాడనీ, తన ఆరోగ్య సమస్యల గురించి మాత్రం చెప్పడని అన్నారు భువనేశ్వరి. పార్టీ కోసం కార్యకర్తలు పడుతున్న కష్టం ముందు తమ కష్టం ఏపాటిదన్నారు. నాలుగు సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్న పార్టీ కార్యకర్తలందరికీ నారా లోకేష్ అండగా నిలబడుతున్నందుకు తల్లిగా తాను సంతోషిస్తున్నానన్నారు. ఇప్పటికే యాత్ర విజయవంతమైందనీ, పూర్తయ్యే సమయానికి మరింత విజయం సాధిస్తుందని అభిలషించారు.  ఇదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో తన పైనా, తన కుటుంబంపైనా ప్రవర్తించిన తీరుకు నెలకుపైగా ఎంతో బాధపడ్డానని చెప్పారు భువనేశ్వరి.

అనేక అవమానాలు ఎదుర్కొన్నాం, ఇక వాటికి భయపడేది లేదు, అలవాటు అయిపోయింది, పోరాడి విజయంతో బయటకు వస్తామని భువనేశ్వరి అన్నారు. నాడు చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ అవమానించిన తీరుకు తీవ్ర భావోద్వేగానికి గురై మీడియా సమావేశంలో కన్నీళ్లుపర్యంతం అయిన విషయం తెలిసిందే. ఇక తండ్రి ఎన్టీఆర్ పేరిట రూ.100 స్మారక నాణెం విడుదల చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దీనికి కృషి చేసిన అక్క పురందేశ్వరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు భువనేశ్వరి. కుప్పంలో ఎన్టీఆర్ సంజీవని ఉచిత వైద్యశాలను ప్రారంభించిన సందర్భంగా భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila: సోనియమ్మ అమ్ములపొదిలోకి చేరిన నాటి జగనన్న వదిలిన బాణం..?

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N