NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నారా భువనేశ్వరి కంట్లో నీళ్ళు – చంద్రబాబు కూడా చూసి చలించిపోయిన ఘటన !

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కుప్పం నుండి ఇచ్చాపురం వరకూ 400 రోజుల పాటు నాలుగు వేల కిలో మీటర్లు ఈ యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే 2600 కిలో మీటర్లు పూర్తి అయ్యింది. తొలుత లోకేష్ తన తల్లిదండ్రులు నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం తీసుకుని పాదయాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత లోకేష్ పాదయాత్రలో భువనేశ్వరి కూడా ఒక రోజు పాల్గొన్నారు. ఆయితే ఆ సందర్భంగా మీడియాతో భువనేశ్వరి ఏమీ మాట్లాడలేదు. కానీ తాజాగా కుప్పంలో పర్యటనలో భువనేశ్వరి .. లోకేష్ పాదయాత్రపై, గతంలో వైసీపీ తమ కుటుంబం చేసిన కామెంట్స్ పై  స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ షేర్ చేసింది.

లోకేష్ పాదయాత్ర చేస్తాను అన్నప్పుడు తాను తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురి అయ్యాననీ, మొదట వద్దన్నానని చెప్పాననీ, కానీ లోకేష్ పట్టుబట్టడంతో సరే అని అన్నట్లు భువనేశ్వరి వెల్లడించారు. కానీ కన్నీళ్లు ఆపుకోలేకపోయానన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు ఇంతగా కష్టపడుతుంటే.. ప్రజలు, కార్యకర్తలు ఇంతగా ఇబ్బందులు పడుతుంటే వారికి నేను ఉన్నానని భరోసా ఇచ్చేందుకే లోకేష్ పాదయాత్ర చేయడం, పాదయాత్ర చేస్తున్న కొద్దీ లోకేష్ రాటుదేలాడనీ, అది చూసి తనకు సంతోషాన్ని కల్గిస్తొందని పేర్కొన్నారు భువనేశ్వరి. పాదయాత్రలో లోకేష్ స్వయంగా అనేక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

తాను ఫోన్ చేసి అడిగినా అంతా బాగుందని చెబుతాడనీ, తన ఆరోగ్య సమస్యల గురించి మాత్రం చెప్పడని అన్నారు భువనేశ్వరి. పార్టీ కోసం కార్యకర్తలు పడుతున్న కష్టం ముందు తమ కష్టం ఏపాటిదన్నారు. నాలుగు సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్న పార్టీ కార్యకర్తలందరికీ నారా లోకేష్ అండగా నిలబడుతున్నందుకు తల్లిగా తాను సంతోషిస్తున్నానన్నారు. ఇప్పటికే యాత్ర విజయవంతమైందనీ, పూర్తయ్యే సమయానికి మరింత విజయం సాధిస్తుందని అభిలషించారు.  ఇదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో తన పైనా, తన కుటుంబంపైనా ప్రవర్తించిన తీరుకు నెలకుపైగా ఎంతో బాధపడ్డానని చెప్పారు భువనేశ్వరి.

అనేక అవమానాలు ఎదుర్కొన్నాం, ఇక వాటికి భయపడేది లేదు, అలవాటు అయిపోయింది, పోరాడి విజయంతో బయటకు వస్తామని భువనేశ్వరి అన్నారు. నాడు చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ అవమానించిన తీరుకు తీవ్ర భావోద్వేగానికి గురై మీడియా సమావేశంలో కన్నీళ్లుపర్యంతం అయిన విషయం తెలిసిందే. ఇక తండ్రి ఎన్టీఆర్ పేరిట రూ.100 స్మారక నాణెం విడుదల చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దీనికి కృషి చేసిన అక్క పురందేశ్వరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు భువనేశ్వరి. కుప్పంలో ఎన్టీఆర్ సంజీవని ఉచిత వైద్యశాలను ప్రారంభించిన సందర్భంగా భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila: సోనియమ్మ అమ్ములపొదిలోకి చేరిన నాటి జగనన్న వదిలిన బాణం..?

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju