కృష్ణా జిల్లాలో వైసీపీ అధినేత జగన్ ఈక్వేషన్లు ఎన్నికలకు ముందే చిత్తుచిత్తు అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 9 జాబితాలలో పలు నియోజకవర్గాలను అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత
కొన్ని నియోజకవర్గాలలో చాలా రాంగ్ ఈక్వేషన్ లతో అభ్యర్థుల మార్పులు చెరుపులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మార్పులు చేర్పులు ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా వచ్చిన వారి గుండెలలో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ ఈక్వేషన్లు తమకు ఏమాత్రం సరిపోవటం లేదని వారు కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితి. మంత్రి జోగి రమేష్ సొంత నియోజకవర్గం మైలవరం, ఆయన ప్రస్తుతం పెడన నుంచి ప్రాధనిత్యం వహిస్తున్నారు.
ఈ రెండు నియోజకవర్గాలలో ఆయనకు సొంత సామాజిక వర్గం బలం ఎక్కువ. అయితే జోగి రమేష్ కు సామాజిక సమీకరణాల పరంగా ఏమాత్రం అనుకూలంగా లేని పెనమలూరుకు ఆయనను పంపారు. పెనమలూరులో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. అలాగే బీసీలలో గౌడ సామాజిక వర్గం కంటే యాదవ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. అలాంటి చోట గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ కు సమన్వయకర్తగా సీటు ఇవ్వడంతో ఆయన అక్కడ పార్టీ నేతలను సమన్వయం చేసుకోలేక ముప్పుతిప్పలు పడుతున్నారు.
ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథి పార్టీ మారడంతో కమ్మ సామాజి వర్గానికి చెందిన పడమటి సురేష్ బాబు వైసీపీ సీటు ఆశించారు. అయితే జగన్ జోగి రమేష్ ను పెనమలూరు కు పంపారు. జోగి రమేష్ కు పెనమలూరు రావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆయన మైలవరం సీటు ఆశిస్తున్నారు. ఇక మైలవరంలో కేవలం జడ్పిటిసిగా ఉన్న సర్నాల తిరుపతిరావు యాదవ్ కు ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. ఆయన ఒక మండల స్థాయి నేత మాత్రమే.
ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్నా మల్లాది విష్ణుని తప్పించి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను సెంట్రల్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా పంపించారు. మల్లాది విష్ణు సీటు పక్కన పెట్టడంతో ఆ నియోజకవర్గంలో 40 వేలకు పైగా ఉన్న బ్రాహ్మణ ఓటర్లు భగ్గుమంటున్నారు. వీరంతా వెల్లంపల్లికి ఎంత మాత్రం సహకరించే పరిస్థితి లేదు. సామాజిక సమీకరణాల పరంగా పెనమలూరు, మైలవరం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో జగన్ పూర్తిగా రాంగ్ ఈక్వేషన్ తో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసినట్టు వైసిపి వర్గాలే చర్చించుకుంటున్నాయి. తమకు నచ్చిన సీటు దక్కక వేరేచోట పోటీ చేయటం ఇష్టం లేక కృష్ణా జిల్లాలో పలువురు వైసిపి అభ్యర్థులు తీవ్రంగా మదన పడుతున్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!