NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

కృష్ణా జిల్లాలో వైసీపీ అధినేత జగన్ ఈక్వేషన్లు ఎన్నికలకు ముందే చిత్తుచిత్తు అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 9 జాబితాలలో పలు నియోజకవర్గాలను అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత
కొన్ని నియోజకవర్గాలలో చాలా రాంగ్ ఈక్వేషన్ లతో అభ్యర్థుల మార్పులు చెరుపులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మార్పులు చేర్పులు ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా వచ్చిన వారి గుండెలలో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ ఈక్వేషన్లు తమకు ఏమాత్రం సరిపోవటం లేదని వారు కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితి. మంత్రి జోగి రమేష్ సొంత నియోజకవర్గం మైలవరం, ఆయన ప్రస్తుతం పెడన నుంచి ప్రాధనిత్యం వహిస్తున్నారు.

ఈ రెండు నియోజకవర్గాలలో ఆయనకు సొంత సామాజిక వర్గం బలం ఎక్కువ. అయితే జోగి రమేష్ కు సామాజిక సమీకరణాల పరంగా ఏమాత్రం అనుకూలంగా లేని పెనమలూరుకు ఆయనను పంపారు. పెనమలూరులో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. అలాగే బీసీలలో గౌడ సామాజిక వర్గం కంటే యాదవ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. అలాంటి చోట గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ కు సమన్వయకర్తగా సీటు ఇవ్వడంతో ఆయన అక్కడ పార్టీ నేతలను సమన్వయం చేసుకోలేక ముప్పుతిప్పలు పడుతున్నారు.

ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథి పార్టీ మారడంతో కమ్మ సామాజి వర్గానికి చెందిన పడమటి సురేష్ బాబు వైసీపీ సీటు ఆశించారు. అయితే జగన్ జోగి రమేష్ ను పెనమలూరు కు పంపారు. జోగి రమేష్ కు పెనమలూరు రావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆయన మైలవరం సీటు ఆశిస్తున్నారు. ఇక మైలవరంలో కేవలం జడ్పిటిసిగా ఉన్న స‌ర్నాల తిరుపతిరావు యాదవ్ కు ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. ఆయన ఒక మండల స్థాయి నేత మాత్రమే.

ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్నా మల్లాది విష్ణుని తప్పించి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను సెంట్రల్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా పంపించారు. మల్లాది విష్ణు సీటు పక్కన పెట్టడంతో ఆ నియోజకవర్గంలో 40 వేలకు పైగా ఉన్న బ్రాహ్మ‌ణ ఓటర్లు భ‌గ్గుమంటున్నారు. వీరంతా వెల్లంపల్లికి ఎంత మాత్రం సహకరించే పరిస్థితి లేదు. సామాజిక సమీకరణాల పరంగా పెనమలూరు, మైలవరం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో జగన్ పూర్తిగా రాంగ్ ఈక్వేషన్ తో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసినట్టు వైసిపి వర్గాలే చర్చించుకుంటున్నాయి. త‌మకు నచ్చిన సీటు దక్కక వేరేచోట పోటీ చేయటం ఇష్టం లేక కృష్ణా జిల్లాలో పలువురు వైసిపి అభ్యర్థులు తీవ్రంగా మద‌న‌ పడుతున్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju