`సైరా నరసింహారెడ్డి` చిత్రానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సినిమాకు విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. ముందు సైరా ఓ బయోపిక్ అని పిటిషన్ వేసిన తమిళనాడు యువ సంఘం నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఇప్పుడు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు సినిమాను కేవలం వినోద పరంగానే చూడాలని తెలియజేసింది. మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా ఎవరూ చూపించారని ప్రశ్నించింది. కల్పిత పాత్రలతో చూపిస్తున్నామంటూ గతంలో తెరకెక్కిన గాంధీజీ, మొగల్ సామ్రాజ్యంపై తెరకెక్కిన సినిమాల గురించి ప్రస్తావించింది. సినిమాను ఆపడం ఇప్పుడు కుదరదని, సినిమా నచ్చడం, నచ్చకపోవడం అనేది ప్రేక్షకులకు వదిలేయాలని తెలియజేసింది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!