ఢిల్లీ: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ ఎంపి హర్షకుమార్ గోదావరి బోటు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బోటుతో పాటు మిగిలిన మృతదేహాలు వెలికితీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. బోటు వెలికితీతపై నిర్లక్ష్యం చేస్తున్నారని హర్షకుమార్ పేర్కొన్నారు.
బోటు ప్రమాదంపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గల్లంతు అయిన వారి సంఖ్య తక్కువగా చూపుతున్నారని హర్షకుమార్ అన్నారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్పైనా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే హర్షకుమార్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హర్షకుమార్ అరెస్టు కోసం ప్రత్యేక టీమ్లను అధికారులు ఏర్పాటు చేశారు. హర్షకుమార్ తప్పించుకునేందుకు సహకరించారన్న ఆరోపణలతో రాజమండ్రి త్రీటౌన్ సిఐ శేఖర్బాబును అధికారులు సస్పెండ్ చేశారు.