అగ్ర నాయిక అనుష్క చాలా గ్యాప్ తర్వాత ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. అయితే తాజాగా సోషల్ మీడియా వర్గాల కథనం మేరకు అనుష్క సినిమా ప్రచారంలో పాల్గొనడానికి ఇష్టపడటం లేదట. కొన్ని వ్యక్తిగత కారణాల కారణంగా అనుష్క ఇంటర్వ్యూలు ఇవ్వనని చెప్పేసిందట. అయితే చిత్ర యూనిట్తో పాటు వారే చిత్రీకరించే గ్రూప్ ఇంటర్వ్యూలో మాత్రమే ఆమె పాల్గొంటుందని వార్తలు వినపడుతున్నాయి.
ప్రమోషన్స్ విషయంలో అనుష్క పెట్టిన కండీషన్స్ కారణంగా చిత్ర నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారని టాక్. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే అనుష్కనే స్పందించాల్సిన అవసరం ఉంది. భాగమతి తర్వాత అనుష్క పూర్తిస్థాయిగా నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. ఇందులో ఆమె సాక్షి అనే దివ్యాంగురాలి పాత్రలో నటించారు. మాధవన్, అండ్రూ హడ్సన్, అంజలి, షాలిని పాండే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మాతలు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!