(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సమర్థతను చాటుకున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం అవార్డులు ప్రకటించింది. ఏపి రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారిగా పని చేసిన గోపాలకృష్ణ ద్వివేది ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డు సాధించారు. ఈ విభాగంలో పంజాబ్, ఒడిషా సిఇఒలూ పురస్కారాలకు ఎంపికైయ్యారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించే ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాధ్ కోవింగ్ ఈ అవార్డులను బహుకరిస్తారు. మొత్తం అయిదు విభాగాల్లో 20మందికి అవార్డులు ప్రకటించారు. భద్రతా వ్యవహారాల విభాగంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తమ అధికారిగా ఏంపిక కాగా, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా జగిత్యాల డిఇఒ ఏ శరత్ కుమార్కు సాధారణ పురస్కారంకు ఎంపికయ్యారు.