NewsOrbit
న్యూస్

వారం తర్వాత బయట పడిన బొత్స అమరావతి పర్యటన రహస్యం! వారినీ…అందుకా అంత హడావుడి?

అమరావతిలో ఏమీ లేదు.. మొత్తం గ్రాఫిక్సేనని .. స్మశానం అని… ఎడారి అని.. విమర్శలు గుప్పించిన సీఆర్డీఏ మంత్రి బొత్స సత్యనారాయణ… వాటిని రెండు రోజుల పాటు పరిశీలించారు. ఇంకా కొంత మిగిలిపోతే.. మళ్లీ వస్తానని అధికారులకు చెప్పారు. ఈ హడావుడి చూసి.. అమరావతి విషయంలో మనసు మార్చుకున్నారేమో అని చాలా మంది అనుకోవడం ప్రారంభించారు.

 

కానీ.. ఇప్పుడిప్పుడే సీఆర్డీఏ వర్గాలు ఓ కొత్త విషయాన్ని చెబుతున్నాయి. ఏమింటంటే.. అక్కడ నిర్మించిన భవనాలను అమ్మేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందట. ఆ టవర్లన్నీ అమ్మే సన్నాహాల్లోనే బొత్స పర్యటన సాగి౦దట. అమరావతిలో గత ప్రభుత్వం మంత్రులు, శాసనసభ్యులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ఉద్యోగుల నివాసాల కోసం భారీ రెసిడెన్షియల్‌ టవర్లను నిర్మించింది. ఒక్కొక్కటి 12 అంతస్తులతో కూడిన సుమారు 63 రెసిడెన్షియల్‌ టవర్లు నిర్మాణం చివరి దశలో ఉన్నాయి.

వీటన్నింట్లో కలిపి సుమారు 4,200లకుపైగా ఫ్లాట్లు ఉంటాయి. మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్‌ సర్వీస్‌ అధికారుల కోసం 180 బంగళాల నిర్మాణాన్ని కూడా గత ప్రభుత్వం చేపట్టింది. వీటిలో అత్యధికం 80 శాతంమేర పూర్తయ్యాయి. ఏడాది నుంచి పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడే ప్రభుత్వంలో కదలిక కనిపిస్తోంది. తక్కువ ధరకైనా తెగనమ్మాలనే సీఆర్డీఏకి సూచనలు ఆ౦దాయట.రాజధాని భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు… కట్టిన టవర్లను పూర్తి చేసి.. రియల్ ఎస్టేట్ తరహాలో అమ్మేడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయమని సీఆర్డీఏ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. భవనాల పూర్తికి ఇంకెంత ఖర్చు అవుతుంది.. అమ్మేస్తే ఎంత ఆదాయం వస్తుందో.. సీఆర్డీఏ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మూడు వేల కోట్ల వరకూ ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు. మార్కెట్ ధర కన్నా… 20 శాతం తక్కువ ధర నిర్ణయిస్తే.. డిమాండ్ బాగుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు.ఆయితే టిడిపి హయా౦లో అమరావతిలో… ప్రజల కోసం హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్‌ను సీఆర్డీఏ చేపట్టింది.

ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లు అన్నీ ప్రాజెక్ట్ ప్రారంభించిన రోజునే అయిపోయాయి. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ కొనుగోలు దారుల్లో ఒక్కంటే.. ఒక్కరు కూడా.. తమకు ఇప్పుడు ఫ్లాట్ కావాలని అడగడం లేదు. ప్రభుత్వం రాజధానిని మార్చాలని నిర్ణయించుకోవడమే దీనికి కారణం. కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. కానీ.. ఏపీ సర్కార్ ఆ ప్రాజెక్టుకూ రివర్స్ టెండర్లు పిలిచింది. డబ్బులు కట్టిన వాళ్లే అక్కడ వద్దని వెనక్కి పోతూంటే… కొత్తగా డిమాండ్ వస్తుందని ప్రభుత్వం మాత్రం ఆశల పల్లకీలో ఉంది. ఎవరి లెక్కలు వారివి మరి!

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N