ఎంతటి కసాయి వాడైనా చిన్న పిల్లలను చూస్తే చలించిపోతాడని అంటారు. కానీ గుర్తుతెలియని వ్యక్తి ఘట్కేసర్ పరిధిలో ఐదేళ్ల చిన్నారి గొంతు కోసి హత్య చేసిన హృదయవిదారకర ఘటన అక్కడి వారిని కలిచివేస్తోంది.
పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం సదరు వ్యక్తి ఒక పదునైన వస్తువుతో ఆ చిన్నారి గొంతును కోసి హత్య చేసాడని తెలుస్తోంది. ఈ దారుణమైన ఘటనకు ఘట్కేసర్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే సదరు వ్యక్తి ఎందుకని ఇంత కిరాతకంగా హత్య చేసాడన్నదానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. నిందితుడికి త్వరలోనే శిక్ష పడేలా చేస్తామని పోలీసులు అంటున్నారు. ఈ నేరానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.