Margadarsi Case: మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ 1, ఏ 2 నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్ లకు నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలంటూ నోటీసులో పేర్కొంది. జూలై 5వ తేదీన విచారణకు హజరు కావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది. గుంటూరులోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి హజరు కావాలని నోటీసులు అందజేసింది సీఐడీ. గత నెలలో రామోజీరావును ఒక సారి ఆయన నివాసంలో విచారణ జరిపిన సీఐడీ అధికారులు.. ఈ నెల మొదటి వారంలో శైలజా కిరణ్ ను విచారించిన సంగతి తెలిసిందే.
అయితే తాము చట్ట పరిధిలో విచారణ చేస్తున్నప్పటికీ శైలజా కిరణ్ విచారణకు సహకరించడం లేదని పదేపదే ఆటంకాలు కల్పించేందుకు ప్రయత్నించారని సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ తెలిపారు. విచారించిన ప్రతి సారీ ఏదో ఒక సాకుతో తప్పించుకోవాలన్నదే ఆమె ఉద్దేశంతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా వారిని ప్రశ్నించాల్సి ఉన్నందున మరో సారి వారివుని విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసినట్లుగా తెలిపారు. ఏపీ సీఐడీ నోటీసులపై రామోజీరావు, శైలజా కిరణ్ లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం .. ప్రయాణీకులు సేఫ్ .. కానీ..