YS Jagan KCR: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు హైదరాబాద్ కు వెళుతున్నారు. ఆయన నేరుగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అదినేత కేసీఆర్ ను కలవనున్నారు. ఇటీవల కేసిఆర్ తన ఫామ్ హౌస్ లో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆసుపత్రిలో ఉన్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, సినీ సెలబ్రిటీలు కేసిఆర్ ను పరామర్శించారు. అయితే ఆ నేపథ్యంలో తనను పరామర్శించడానికి ఆసుపత్రికి ఎవరూ రావద్దని, వీవీఐపీలు రావడంతో సాధారణ రోగులకు ఆసుపత్రిలో ఇబ్బందులు కలగడంతో పాటు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని కేసిఆర్ స్వయంగా విజ్ఞప్తి చేశారు.
దీంతో నాడు సీఎం జగన్ యశోదా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. రెండు మూడు సంవత్సరాల క్రితం వరకూ కేసిఆర్, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగినప్పటికీ జల వివాదాల నేపథ్యంలో ఇరు ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఏపీ పై తెలంగాణ, తెలంగాణపై ఏపీ కోర్టులో కేసులు వేసుకున్నాయి.
ఎన్నికల సమయంలో, అంతకు ముందు కూడా ఏపీ సర్కార్ తీరుపై కేసిఆర్ సహా ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. దాదాపు రెండు మూడు సంవత్సరాల తర్వాత కేసిఆర్ తో జగన్ భేటీ అవుతున్నారు. అయితే ఇది కేవలం పరామర్శకే అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య రాజకీయ పరమైన చర్చలు కుడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
YS Sharmila: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద షర్మిలకు ఘన స్వాగతం పలికిన నేతలు