YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండవ రోజు ఆదివారం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. రాత్రి ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో బస చేసిన సీఎం వైఎస్ జగన్.. ఉదయం వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకుని వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయలో పార్థనలో పాల్గొన్నారు.కార్యక్రమాల్లో జిల్లా ఇన్ చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి, ఎమ్మెల్య కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్ సమావేశమైయ్యారు. సమావేశానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ అమరనాథ్ రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తదుపరి సింహాద్రిపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎమ్మార్వో ఆఫీసు, పోలీస్ స్టేషన్, రహదారి విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. తిరిగి సాయంత్రం ఇడుపులపాయ చేరుకుంటారు.
కాగా, సీఎం జగన్ తన సొంత జిల్లా కడప లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రిమ్స్ ఆవరణలో క్యాన్సర్, మెంటల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించారు. కలెక్టరేట్ లోని నూతన నిర్మాణ భవనాలను ప్రారంభించారు. రేపు పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తాడేపల్లికి చేరుకోనున్నారు.
Chandrababu Prashant Kishor: బాబోరిలో భయం ..! అందుకే అవసరం అయ్యాడా పీకే..??