Indrakeeladri: బెజవాడ కనకదుర్గ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తొంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతుల కల్పిస్తొంది. అందులో భాగంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు సమాయత్తమైంది దేవాదాయ శాఖ. ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్ లోని రూ.216.05 కోట్ల విలువైన పలు పనులకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.
అలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.70 కోట్లు విడుదల చేసింది. తాడేపల్లి నివాసం నుండి బయలుదేరిన ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ముందుగా అభివృద్ధి పనులు పూర్తి అయిన తర్వాత రూపుదిద్దుకునే ఇంద్రకీలాద్రి కొండ నమూనాను పరిశీలించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన మల్లేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం ప్రారంభించారు. రూ.4 కోట్ల 25 లక్షల తో చేపట్టిన కొండ రక్షణ పనులు, ఎల్టీ ప్యానెల బోర్డులు, ఎనర్జీ, నీటి నిర్వహణ, స్కాడా పనులు పూర్తి కాగా వీటిని ప్రారంభించారు.
రూ.216 కోట్లతో చేపట్టనున్న అన్న ప్రసాద భవనం, ప్రసాదం పోటు భవనం, ఎలివేటేడ్ క్యూ కాంప్లెక్స్, రాజగోపురంముందు భాగం వద్ద మెట్ల నిర్మాణం, దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్, కనకదుర్గానగర్ ప్రవేశం వద్ద మహారాజ ద్వార నిర్మాణం, మల్లికార్జున మహా మండపం వద్ద క్యూ కాంప్లెక్స్ మార్పు, నూతన కేశ ఖండన శాల, ప్రస్తుత గోశాల భవనాన్ని బహుళ సముదాయంగా మార్పు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇంద్రకీలాద్రి పర్యటన నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. మంత్రి, ఆలయ అధికారులు అమ్మవారి జ్ఞపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Revanth Reddy: రేవంత్ తొలి కేబినెట్ లో ఈ 11 మందికి చోటు