Trinayani December 07 2023 Episode 1104: ముందు నీకు కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో తెలుసుకో అని విక్రాంత్ అంటాడు. ఏంటి రాకూడదా అని సుమన అంటుంది. పెద్ద బొట్టమ్మకి అన్నం పెట్టినందుకు ఇలా నీకు కడుపు నొప్పి వచ్చింది సుమన అని డమ్మక అంటుంది. అన్నం పెడితే ఆకలి తీరుతుంది కానీ కడుపు నొప్పి ఎందుకు లేస్తుంది అమ్మ అని పావనమూర్తి అంటాడు. అంటే అన్నంలో ఏదైనా పెట్టి పెద్ద బొట్టమ్మని చంపాలని చూసావా అని విక్రాంత్ అంటాడు. అవును పుత్ర అన్నంలో విష ప్రయోగం చేసింది అని డమక్క అంటుంది. అంటే నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు ఇలాంటి దిక్కుమాలిన పనులు ఎందుకు చేస్తావు ఇలా ఎందుకు తిప్పలు పడతావు అని విక్రాంత్ సుమనని తిట్టి వెళ్లిపోతాడు. కట్ చేస్తే, అమ్మ ఈరోజు స్వామీజీని నేనే అడుగుతాను నువ్వేమీ మాట్లాడకు అని వల్లభ అంటాడు. సరే పదరా అని తిలోత్తమ అంటుంది.
స్వామీజీ నువ్వు చెప్పినట్టు చేస్తే ఆ విశాలాక్షి హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది కానీ నిజం మాత్రం చెప్పలేదు అని వల్లభ అంటాడు. అలా జరగదే నాగయ్యని కట్టడి చేశారా అని స్వామి అంటాడు. లేదు స్వామి విశాలాక్షి పువ్వులు పెట్టుకొని కళ్ళు తిరిగి పూనకం వచ్చే సమయానికి గురువుగారు వచ్చారు దానితో గాయత్రి అక్క జాడ అడగలేకపోయాను అని తిలోత్తమ అంటుంది. అలా చెప్పు మరి గురువుగారి సహాయంతో ఆ మంత్రపుష్పాలను దాటి నాగయ్య లోపలికి వచ్చి ఆ ధూపాన్ని కింద పడేసి విశాలాక్షికి స్పృహ కోల్పోయేలా చేశాడు అని అఖండ స్వామి అంటాడు. ఇప్పుడు ఏం చేయాలో మీరే మార్గం చూపించండి స్వామి అని తిలోత్తమ అంటుంది. ఈ విభూదిని తీసుకువెళ్లి కన్నతల్లి ఊపిరి తగిలేలా చేసి నాగులపురం పెట్టె మీద పెడితే బిడ్డ జాడ తెలుస్తుంది అని అఖండ స్వామి చెప్తాడు. గాలిని ఎలా బంధిస్తారు స్వామి అది కూడా నైనీ ఊపిరి జరగదు అని వల్లభ అంటాడు. మూర్ఖుడా పరిహాసం చేయటనేకి సమయం సందర్భం ఉండక్కర్లేదా అని స్వామీజీ అంటాడు. వాడేదో తెలియక అలా మాట్లాడాలి స్వామి మన్నించాలి ఇక మేము బయలుదేరుతాము స్వామి అని తిలోత్తమ అక్కడి నుంచి వల్లభను తీసుకుని వెళ్ళిపోతుంది.
గాయత్రీ జాడ ఈరోజుతో ఎక్కడ ఉందో మీకు తెలిసిపోతుంది అని స్వామీజీ అనుకుంటాడు. కట్ చేస్తే, అమ్మ ఇన్ని రోజులు ఎలాగో అలా తిలోత్తమ కి నీ జాడ తెలియకుండా కాపాడుకోగలిగాము కానీ ఈరోజు నీ జాడ తనకి తెలిసేలా ఉంది పరిస్థితి చేయి జారిపోయింది అని డమ్మక్క అంటుంది. ఏంటి డమ్మక్క గాయత్రి ని ఆడిదామని చూస్తున్నావా అని పావన మూర్తి అంటాడు. తనే మనల్ని ఆడిస్తుంది బాబాయ్ తనని మనం ఎలా ఆడించగలము అని హాసిని అంటుంది. ఇంతలో త్రిలోత్తమ్మ వచ్చి పిల్లను ఆడించాలి అంటే వాళ్లకు తగ్గట్టుగా వస్తువులు తెచ్చి వాటితో ఆడించాలి అందుకే ఈ బెలూన్ ను తెచ్చాను ఊదండి అని అంటుంది తిలోత్తమ. ఇటు ఇవ్వు అక్క నేను ఊదుతాను అని పావనిమూర్తి అంటాడు. హాసిని నువ్వు కూడా ఊదు అని తిలోత్తమ అంటుంది. నా ఒంట్లో రక్తమే సరిగ్గా లేదు ఇంకా గాలి ఎక్కడ ఉంటుంది అత్తయ్య నేను ఊతలేను అని హాసిని అంటుంది. ఏంటి ఏదైనా ఫంక్షన్ బెలూన్స్ తెచ్చారు అని నైని అంటుంది. వీళ్ళ మొహాలకి అదొక్కటే తక్కువ చెల్లి అని హాసిని అంటుంది. వదిన అందరికీ వినపడుతుంది అని విక్రాంత్ అంటాడు. సారీ బయటికి అనేసానా అని హాసిని అంటుంది. పిల్లలు ఆడుకుంటారనే బెలూన్స్ తెచ్చాను తలా ఒకటి ఊదండి అని తిలోత్తమా నైనికి విశాల్ కి విశ్రాంత్ కి ఇస్తుంది. అందరూ బెలూన్ ఊదుతూ ఉంటారు.సుమన నువ్వు కూడా ఊదు అని తిలోత్తమ అంటుంది. నేను ఊదలేను అత్తయ్య అని సుమన అంటుంది.
గాలి ఊదడానికైతే చేతకాదు కానీ ఇంట్లో వాళ్లని ఎలా వేధించాలో తెలుసు అని విక్రాంత్ అంటాడు. అలా అందరూ బెలూన్స్ ఊదుతూ ఉండగా త్రిలోత్తమ నైనికి విభూది పోసిన బెలూన్ ఇస్తుంది. దాంట్లో ఏముందో చూసుకోకుండా నైని గాలి ఊదుతుంది. నైని ఆ బెలూన్ లో గాలి ఊదగానే తిలోత్తమ తీసుకొని వెళ్ళిపోతుంది. నైని కి దగ్గు వచ్చినట్టు అనిపిస్తుంది. ఏమైంది నైని ఏమైనా ప్రాబ్లమా అని విశాల్ అంటాడు. అందరికన్నా బలంగా ఉంది నైని బాగా అవుతుంది అన్నారు కదా అలా అవుద్ది అక్కకి ఊపిరి ఆడటం లేదేమో బావగారు అని సుమన అంటుంది. విశాల్ నైని కి మంచినీళ్లు తాపిస్తాడు. ఉలొచ్చిని కూడా తీసుకురా సుమన పిల్లలతో ఆడుకుంటుంది అని విక్రాంత్ అంటాడు. ఏమి అవసరం లేదు అని చిరాకుగా అంటుంది సుమన. అలా బెలూన్లతో గాయత్రి ని అందరూ ఆడిస్తూ ఉంటారు. కట్ చేస్తే, వల్లభ నాగులపురం పెట్టాను తెచ్చి నైనీ ఊదిన బెలున్ ని దాని మీద పెడతారు. అప్పుడు ఆ బెలూన్ పైకి లేస్తూ ఇంట్లోకి వెళుతుంది. ఆ బెలూన్ వెనకాల వల్లభ తిలోత్తమ వెళుతూ ఉంటారు. బెలూన్ వెనకాల పైకి చూస్తూ వస్తూ ఉండగా తిలోత్తమేకి గడప తగులుతుంది.
చూసుకొని నడువు అలా పైకి చూస్తే కింద పడిపోతావు అని హాసిని అంటుంది.అదిగో నైని ఊదిన బెలూన్ ఇలా వచ్చేస్తుంది అని డమ్మక అంటుంది.అరే అదేంటి అలా గాల్లో తేలుతూ వస్తుంది అని విక్రాంత్ అంటాడు. అదేమైనా మామూలు బేలున్ అనుకున్నావా తమ్ముడు అని వల్లభ అంటాడు. ఆ బెలూన్ స్పెషల్ ఏంటో బ్రదర్ అని విక్రాంత్ అంటాడు. అది గాయత్రీ పెద్దమ్మ జాడను చూపించే బెలూన్ అని వల్లభా నోరు జారుతాడు. ఆ మాట వినగానే అందరూ షాక్ అయిపోతారు. ఆ బెలూన్ గాయత్రి ఫోటోకి తగిలి మీ అమ్మ జాడను చూపెడుతుంది అని డమ్మక్క అంటుంది.
ఆ మాట వినగానే కంగారు పడిపోయిన విశాల్, అదేంటి అమ్మ బెలూన్ అమ్మ జాడను చూపించడమేంటి అని విశాల్ అంటాడు. అవును విశాల్ ముందే చెప్తే మీరు నమ్మరు ఎగతాళి చేస్తారని మీకు చెప్పలేదు, కానీ ఒక స్వామీజీని కలిస్తే విభూదికి నైని ఈ ఊపిరి తగిలితే గాయత్రి జాడ తెలుస్తుందని చెప్పాడు అని తిలోత్తమ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!