YS Jagan: రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలిచే పథకం లా నేస్తం. ఈ పథకం ద్వారా ఇవేళ 2,807 మంది న్యాయవాదులకు 2023 – 24 సంవత్సరానికి సంబంధించి రెండో విడత నిధులను తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేల వంతున స్టైఫండ్ ఈ ఏడాది జూలై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలలకు ఒకొక్కరికి రూ.30వేలు వారి ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ లా నేస్తం పథకం ద్వారా ఇప్పటి వరకూ 6,069 మంది న్యాయవాదులకు మేలు జరిగిందన్నారు. నాలుగేళ్లలో రూ.49.51 కోట్లు అందించడం జరిగిందని చెప్పారు. వంద కోట్ల రూపాయలతో అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పేదలకు యువ న్యాయవాదులు న్యాయం చేయాలని సూచించారు. లా పూర్తి చేసుకుని తమ వృత్తిలో తాము నిలబడేందుకు వారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్ల పాటు సంవత్సరానికి రూ.60వేలు చొప్పున అందిస్తున్నామన్నారు.
జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వడం వల్ల కోవిడ్ సమయంలో వీళ్లదందరికీ చాలా మంచి జరిగిందన్నారు. ఇబ్బందుల్లో ఉన్న అడ్వొకేట్ లను ఆదుకుంటూ 7,733 మందికి రూ.11.56 కోట్ల రుణాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అంతే కాకుండా మరో 14,848 మంది అడ్వొకేట్ల కు మెడిక్లైయిమ్ పాలసీ కింద రూ.11.41 కోట్లు చెల్లించడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం ఏ రకంగా మీకు తోడుగా నిలబడుతుంతో అదే విధంగా పేదవాడి పక్షాన జూనియర్ న్యాయవాదులు కూడా అంతే ఔదార్యం చూపిస్తూ వారికి మంచి చేసే విషయంలో మానవతా దృక్పదంతో వ్యవహరించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
YSRCP: పార్టీకి, ఎమ్మెల్యే పదవికి వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా