AP High Court: ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 పిటిషన్ పై హైకోర్టులో రెండవ రోజు వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. విచారణ రెండో రోజు మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకూ వాదనలు కొనసాగాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం .. నిన్నటి వరకూ జివో నెంబర్ 1 పై సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో ఏపి ప్రభుత్వం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఏపి హైకోర్టు సీజే నేతృత్వంలో విచారణ జరపాలని ఆదేశించిన నేపథ్యంలో సోమవారం (23వ తేదీ) సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ విచారణ సందర్భంలో వేకేషన్ బెంచ్ అత్యవసర విచారణ జరపడాన్ని తప్పుబడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీజే. కాగా ఇదే కేసులో ఇంప్లీడ్ పిటిషన్ లు దాఖలు చేసిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ తరపున న్యాయవాదులు మంగళవారం వాదనలు వినిపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం జీవో 1 తెచ్చిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. జీవో నెం.1 పై స్టేను కొనసాగించాలని టీడీపీ తరపున న్యాయవాది అభ్యర్ధించగా, ఆ అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇురపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.