Big Breaking: తిరుపతి ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు సభపై రాళ్ల దాడి జరిగింది. తిరుపతి గాంధీ రోడ్డులో చంద్రబాబు ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వాహనంపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు యువకుడికి గాయాలు అయ్యాయి.
ఈ చర్యపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన వారితో మాట్లాడిన చంద్రబాబు ఇది పరికిపంద చర్య అని వ్యాఖ్యానించారు. ఇది పోలీసుల వైఫల్యమంటూ మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు. నిరసనకు దిగవద్దని పోలీసు అధికారులు చంద్రబాబును కోరగా ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న తనకే భద్రత కల్పించలేని పోలీసు యంత్రాంగం సామాన్యులను ఏమి కాపాడతారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపి శ్రేణులు నినాదాలు చేశారు. ఈ ఘటనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వివాదానికి దిగారు.