Somu Veerraju: నెల్లూరులో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ పై తీవ్ర కామెంట్స్ చేశారు. ధాన్యానికి గిట్టుబాట ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో బీజేపీ నేతలు ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నేతలు మండిపడ్డారు. తక్షణమే గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయారని సోము వీర్రాజు ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతాంగాన్ని ప్రభుత్వం మోసం చేస్తోందని సోము వీర్రాజు అన్నారు. దళారుల దోపిడీకి రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం మిల్లర్ల చేతిలో కీలుబొమ్మలా మారిందని ఆరోపించారు సోము వీర్రాజు. ఎఫ్ సీ ఐ కొనుగోలు చేయనీయకుండా, ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సోమ వీర్రాజు విమర్శించారు.
Somu Veerraju: అసమర్ధ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే ఈ కష్టాలు
అనంతరం నెల్లూరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికుల ఆందోళనకు సోము వీర్రాజుతో సహా బీజేపీ నేతలు సంఘీభావం తెలియజేశారు. బొగ్గు సకాలంలో ఇవ్వకపోవడం వల్లనే విద్యుత్ ఉత్పత్తి కేంపద్రం ప్రైవేటీకరణ చేస్తున్నారని వీర్రాజు విమర్శించారు. కోట్ల రూపాయలు సంపాదించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అసమర్ధ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే ఈ కష్టాలు తలెత్తాయని సోము వీర్రాజు ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇంకా కేంద్ర ప్రైవేటీకరణ చేయలేదన్నారు. వైసీపీ సభ్యులు పార్లమెంట్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడుతున్నారనీ, ఇక్కడ మాత్రం జెన్ కో ను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిధులు కేటాయిస్తున్న విషయాన్ని సోము వీర్రాజు గుర్తు చేశారు.