జనసేన ఖాతాలో రెండు పార్లమెంటు స్థానాలు పడనున్నాయా? మిత్రపక్షంలో భాగంగా జనసేన తీసుకు న్న రెండు స్థానాలను గెలుచుకునే పక్కా వ్యూహంతోనే ముందుకు సాగుతోందా? అంటే ఔననే అంటు న్నారు పరిశీలకులు. జనసేన పోటీ చేయనున్న మచిలీపట్నం పార్లమెంటు, కాకినాడ పార్లమెంటు స్థానా లు కూడా చాలా బలమైన నియోజకవర్గాలు కావడం గమనార్హం. సామాజిక వర్గాల పరంగా మచిలీపట్నం లో కాపులు ఎక్కువగా ఉంటే.. కాకినాడ నియోజకవర్గంలో కాపులు, రెడ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ జనసేన బలమైన నాయకులకే అవకాశం ఇచ్చింది. మచి లీపట్నం నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ బాలశౌరి.. టికెట్ను మార్చడంతో పార్టీ మారి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయనకే తిరిగి జనసేన మచిలీపట్నం టికెట్ ఎనౌన్స్ చేసింది. ఆయన కు ఉన్న మంచి.. ఇమేజ్, కాపుల్లో జనసేనను గెలిపించుకోవాలన్న కసి వంటివి ఈ దఫా కలిసి రానున్నా యి. వీటికితోడు.. బాలశౌరికి వైసీపీ టికెట్ ఇవ్వలేదన్న ఆవేదన కూడా నియోజకవర్గంలో కనిపిస్తోంది.
ఈ మూడు పరిణామాలు కూడా.. బాలశౌరికి ప్లస్ కానున్నాయి. ఇక, గత ఐదేళ్ల కాలంలో మచిలీపట్నం హార్బర్ నిర్మాణం కోసం.. ఆయన బాగానే శ్రమించారు. కేంద్రం నుంచి ఇక్కడికి నిదులు కూడా తీసుకువ చ్చారు. సో.. ఇది బాలశౌరికి మరింత కలిసి రానుంది. దీంతో బాలశౌరిగెలుపు నల్లేరుపై నడకగా మారినా ఆశ్చర్యం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే.. వైసీపీ నుంచి కూడా బలమైన అభ్యర్థే ఉండడంతో కొంత టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది.
ఇక, కాకినాడ నియోజకవర్గానికి తాజాగా ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్లను జనసేన అధినేత ప్రకటించారు. ఈయన పార్లమెంటుకు తొలిసారి పోటీ చేస్తున్నారు. టీ-టైమ్ వ్యాపార వేత్త అయిన యువ పారిశ్రామిక వేత్త కావడం, ఆర్థికంగా బలంగా ఉండడం, యువతను ఆకర్షించడం వంటికారణాలు ఈయనకు ప్లస్గా మారనున్నాయి. పైగా ఈ నియోజకవర్గం పరిధిలోని పిఠాపురం నుంచి పవన్ కూడా పోటీ చేయనున్నారు. దీంతో ఇక్కడ కూడా జనసేన పాగా వేసే అవకాశం ఉంది.